हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Telugu News: Flight services:భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ఐదేళ్ల తర్వాత పునరుద్ధరణ

Pooja
Telugu News: Flight services:భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ఐదేళ్ల తర్వాత పునరుద్ధరణ

భారత్-చైనా మధ్య గల్వాన్ సంఘర్షణల తర్వాత దాదాపు ఐదేళ్లుగా నిలిచిపోయిన విమాన సర్వీసులు(Flight services) మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రి కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం(Netaji Subhash Chandra Bose International Airport) నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరానికి ఇండిగో తొలి వాణిజ్య విమానం బయలుదేరింది. 176 మంది ప్రయాణికులతో 6E1703 నంబర్‌ విమానం రాత్రి 10 గంటలకు ఎగిరి, సోమవారం ఉదయం 4 గంటలకు గ్వాంగ్‌జౌలో ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రయాణికులు దీపాలు వెలిగించి పునరుద్ధరణను ఆనందంగా జరుపుకున్నారు.

Read Also: TG Crime: ప్రాణంమీదకు తెచ్చిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. పెళ్లి

Flight services
Flight services:భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ఐదేళ్ల తర్వాత పునరుద్ధరణ

కోల్‌కతా నుంచి గ్వాంగ్‌జౌకు మొదటి విమానం

దీంతో పాటు గ్వాంగ్‌జౌ నుంచి కూడా ఇండియాకు విమానం బయలుదేరింది. నవంబర్ 9 నుంచి షాంఘై-దిల్లీ, నవంబర్ 10 నుంచి దిల్లీ-గ్వాంగ్‌జౌ మార్గాల్లో కూడా విమానాలు(Flight services) తిరిగి ప్రారంభం కానున్నాయి. చైనా డిప్యూటీ కాన్సుల్ జనరల్ క్విన్ యోంగ్ ఈ పరిణామంపై స్పందిస్తూ, “ఇది భారత్-చైనా సంబంధాల్లో కీలక దశ” అని అన్నారు. కోవిడ్ మహమ్మారి, గల్వాన్ ఘర్షణల కారణంగా ఇరు దేశాల మధ్య విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

కోవిడ్‌కు ముందు బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌ, కున్మింగ్‌ నగరాల నుంచి భారతదేశంలోని దిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాలకు వారానికి 50 విమాన సర్వీసులు ఉండేవి. వాటిని పునరుద్ధరించేందుకు చైనా గత సంవత్సరం నుంచే భారత్‌తో చర్చలు ప్రారంభించింది. ఈ ఏడాది భారత్-చైనా దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. జనవరిలో భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్రీ చైనాను సందర్శించిన తర్వాత ఇరుదేశాలు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి.

లద్దాఖ్ సరిహద్దులో ఇరు దేశాల బలగాల ఉపసంహరణ, గస్తీ పునరుద్ధరణ ఒప్పందం తర్వాత ఈ అంశంపై చర్చలు వేగం పుంజుకున్నాయి. ఇటీవల జరిగిన మోదీ-జిన్‌పింగ్ సమావేశంలో కూడా ఈ విషయంపై అంగీకారం కుదిరింది. చివరికి ఐదేళ్ల తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి.

భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయి?
కోవిడ్-19 మహమ్మారి మరియు గల్వాన్ లోయ ఘర్షణల కారణంగా 2020లో ఇరు దేశాలు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

మొదటి విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరింది?
కోల్‌కతా నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు ఇండిగో తొలి వాణిజ్య విమానం బయలుదేరింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870