గుజరాత్ రాష్ట్రంలో జరిగిన తాజా ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలోని బీజే మెడికల్ కాలేజీ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో కన్నీరు ముంచింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, ఒక్కరే ప్రాణాలతో బయటపడటం మినహా మిగతావారంతా మరణించారు. ఇది గుజరాత్లో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లోనే అత్యంత ఘోరమైనదిగా గుర్తింపు పొందింది.
యూజీ మెస్పై కుప్పకూలిన విమానం
ఈ ప్రమాదంలో విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీకి చెందిన యూజీ మెస్ భవనం పై పడిపోయింది. ఆ సమయంలో అక్కడున్న 20 మందికిపైగా విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యుల కన్నీటి వేదన
ఠాకూర్ రవి (Thakur Ravi) మీడియాతో మాట్లాడుతూ – యూజీ మెస్లో వంటపని చేసే ఠాకూర్ రవి తల్లి, రెండేళ్ల కుమార్తె ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఠాకూర్ రవి మీడియాకు వెల్లడించారు. తాను, తన భార్య, తల్లి, తమ్ముడు కలిసి యూజీ మెస్లో వంటలు చేస్తుంటామని, గురువారం కూడా ఎప్పటిలాగే వంటలు చేసిన తర్వాత ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ ప్రమాదంలో తన తల్లి సరళాబెన్ ప్రహ్లాద్జీ ఠాకూర్, రెండేళ్ల కుమార్తె ఆద్యరవి ఠాకూర్ గల్లంతయ్యారని రవి ఠాకూర్ చెప్పారు. వారి కోసం గురువారం చీకటిపడేవరకు వేచిచూసినా జాడ దొరకలేదన్నారు. వాళ్లు భవనం లోపలే చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు.
సహాయ చర్యలు కొనసాగుతున్నాయి
ప్రమాదం జరిగిన వెంటనే NDRF, ఫైర్ సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిధిలాల తొలగింపు, శవాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. కొంతమంది శరీరాలను గుర్తించలేని స్థితి ఏర్పడింది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించింది.
Read also: Flight Crash: విమానంలో చివరి క్షణంలో ఏం జరిగింది?