📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: పాకిస్థాన్‌లో నమాజ్ చేస్తుండగా మసీదులో పేలుడు

Author Icon By Vanipushpa
Updated: March 15, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బలూచిస్తాన్ లో రైలు హైజాక్ ఘటన, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో తాలిబన్ల దాడులతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ట్రైన్ హైజాక్ ఘటన, ఆత్మాహుతి దాడులు జరిగిన కొన్ని గంటల్లో పాకిస్థాన్ లో మరో దాడి జరిగింది. రంజాన్ వేళ వాయవ్య పాకిస్థాన్‌లోని శుక్రవారం పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్ లోని ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన పేలుడులో ఒక స్థానిక ఇస్లామిస్ట్ నాయకుడు, ఇద్దరు పిల్లలు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

రాజకీయ పార్టీ స్థానిక నాయకుడు అబ్దుల్లా నదీమ్‌ను లక్ష్యంగా

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జామియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ (JUI-F) రాజకీయ పార్టీ స్థానిక నాయకుడు అబ్దుల్లా నదీమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం గాయపడిన అబ్దుల్ నదీమ్ ను ఆస్పత్రిలో చేర్చారు. స్థానిక మీడియా ప్రకారం.. అతని పరిస్థితి విషమంగా ఉంది. మౌలానా అబ్దుల్ అజీజ్ మసీదులో జరిగిన పేలుడులో గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని దక్షిణ వజీరిస్తాన్ జిల్లా పోలీసులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఎవరు బాధ్యులో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఐదుగురు మరణించగా.. 15 మంది గాయపడ్డారు

పాకిస్థాన్ లోని నౌషెరా జిల్లాలోని దారుల్ ఉలూమ్ హక్కానియా సెమినరీ లక్ష్యంగా చేసుకుని ఆత్మాహతి దాడి జరిగిన ఒక నెలలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ మదర్సా ఆఫ్ఘన్ తాలిబన్లకు చారిత్రక శిక్షణా స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆత్మాహుతి దాడిలో జేయూఐడఎస్ నాయకుడు మౌలానా హమీదుల్ హక్ హక్కానీ తో పాటు ఐదుగురు మరణించగా.. 15 మంది గాయపడ్డారు. మరోవైపు పెరుగుతున్న ఉగ్రవాదంపై తన అణిచివేతను తీవ్రతరం చేస్తామని పాకిస్థాన్ ప్రతిజ్ఞ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించింది. పాలక ఆఫ్ఘన్ తాలిబన్ సర్కారు ఈ వాదనను తిరస్కరించింది.

during prayers Explosion in mosque Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.