📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Egypt :భారత్‌కు సాయం చేస్తున్న ఈజిప్టు దేశం..!

Author Icon By Sudha
Updated: June 19, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వారం రోజులుగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఈ రెండు దేశాల్లో చిక్కుకున్న వేల మంది భారతీయులను(Indians)అర్మేనియా ద్వారా ఇరాన్ నుండి, ఈజిప్ట్ (Egypt)సహకారంతో ఇజ్రాయెల్ (Israel) నుండి సురక్షితంగా తీసుకువస్తున్నారు.

Egypt :భారత్‌కు సాయం చేస్తున్న ఈజిప్టు దేశం..!

ప్రజలను తరలించడానికి సహాయం
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వారం రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి. ఈ దేశాల మధ్య వివాదం ముదురుతుందే కానీ, తగ్గడం లేదు. ఆ దేశాల్లో ఉండే వారు ప్రమాదంలో ఉన్నారు. ఈ రెండు దేశాలలో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. దీంతో.. వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ప్రభుత్వం అర్మేనియా దేశం ద్వారా ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకువస్తోంది. అదే సమయంలో ముస్లిం దేశం ఈజిప్ట్ ఇజ్రాయెల్ నుండి భారతీయుల తిరిగి రావడానికి భారత్‌కు సహాయ హస్తం అందించింది. ఇజ్రాయెల్ నుండి ప్రజలను తరలించడంలో భారతదేశానికి సహాయం చేస్తామని ప్రకటించింది. భారతదేశంలోని ఈజిప్టు రాయబారి కమెల్ గలాల్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ నుండి ప్రజలను తరలించడానికి తమ దేశం భారతదేశానికి సహాయం చేస్తుందని అన్నారు.
దేశాల మధ్య స్నేహం బంధం
ఇజ్రాయెల్-ఈజిప్టు భూ సరిహద్దు భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఒక ఎంపిక. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఈజిప్టు ఇప్పుడు భారత్‌కు సాయం చేస్తుండటంతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య స్నేహం బంధం బలపడింది. ఇజ్రాయెల్ నుండి వెళ్లిపోవాలి అనుకునే భారతీయ పౌరులు భూ సరిహద్దును దాటే అవకాశాన్ని పొందవచ్చని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఎంపికను ఎంచుకునే భారతీయులు ఈజిప్ట్, జోర్డాన్‌లకు సమయాన్ని నిర్ధారించి వీసాలు పొందవలసి ఉంటుందని రాయబార కార్యాలయం తెలిపింది. 32,000 కంటే ఎక్కువ మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు.
ద్వైపాక్షిక సహకారం బలోపేతం
ప్రస్తుతం ఈజిప్ట్ భారతదేశంతో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ గత నెలలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై భారతదేశం తీసుకున్న చర్యలను ప్రశ్నించింది. పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడింది. అయితే, భారత సైన్యం ఆపరేషన్ తర్వాత ఎంపీల ప్రతినిధి బృందం ఈజిప్టుకు చేరుకున్నప్పుడు, దాని స్వరం మారిపోయింది. ఉగ్రవాదంపై భారతదేశం అనుసరిస్తున్న విధానాన్ని ఆ దేశం ప్రశంసించింది. ప్రతి రంగంలోనూ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని ఈజిప్టు స్పష్టంగా పేర్కొంది.

Read Also:Quantum Communication : ‘గేమ్ ఛేంజర్’గా క్వాంటమ్

#IndiaEvacuation #IndianStudents #IranIsraelConflict #MEA #OperationSindhu Breaking News in Telugu Egypt is Google news helping India..! Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.