📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా న‌మోదు!

Author Icon By sumalatha chinthakayala
Updated: February 28, 2025 • 8:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు

కాఠ్‌మాండూ: హిమాలయ దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. సింధుపల్‌చోక్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించిందని సమాచారం. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాలను చూస్తే, నేపాల్‌లోని సింధుపల్‌చోక్ జిల్లాలో భైరవకుండ వద్ద భూప్రకంపనలు సంభవించాయి. అక్కడే భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వెల్లడించారు. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

నేపాల్‌ భూకంపం ప్రభావం భారతదేశంలో..

ఇంకా, ఈ భూకంప ప్రభావం భారత్‌, చైనా, టిబెట్‌ సరిహద్దుల్లో స్వల్పంగా కనిపించిందని అధికారులు తెలియజేశారు.నేపాల్‌ భూకంపం ప్రభావం భారతదేశంలోని ఉత్తర రాష్ట్రాలపై కూడా పడింది. ముఖ్యంగా బీహార్‌ రాజధాని పాట్నా, పశ్చిమబెంగాల్‌, సిక్కింలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. దీని కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లో కూడా భూకంపం సంభవించింది. అక్కడ రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదు అయింది. ఈరోజు 05.14 ISTకి పాకిస్తాన్‌ను తాకింది.

Breaking News in Telugu Earthquake Google news Google News in Telugu Latest News in Telugu nepal Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.