📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Earthquake : మయన్మార్‌లో భూకంపం..2700కు పెరిగిన మృతులు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 1, 2025 • 6:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Earthquake : మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో ఇటీవల 12 నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూ ప్రకంపనల ధాటికి అనేక భవంతులు ఊగిపోగా.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఈ భూవిలయం లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం వచ్చిన ఆ భూకంప ధాటికి 2,719 మంది ప్రాణాలు కోల్పోయారని తాజాగా స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారని తెలిపాయి. 4,521 మంది గాయపడగా.. 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.

వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం

ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకోలేని ప్రభావిత ప్రాంతాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడే పరిస్థితి లేకపోయింది. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండుటెండలో ఉత్త చేతులతో, చిన్నచిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ, ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రీస్కూల్ కూలిపోవడంతో 50 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు చనిపోయారని ఐరాస సిబ్బంది వెల్లడించారు.

వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు

వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు అవరోధంగా మారాయి. ఈ పరిణామాల మధ్య మృతుల సంఖ్య ఎంతకు చేరుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్ తక్షణమే అందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలు పిలుపునిస్తున్నాయి.

Breaking News in Telugu Earthquake Google news Google News in Telugu Latest News in Telugu Myanmar Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.