📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Earthquake : అఫ్గనిస్తాన్ లో భూకంపం…రిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 29, 2025 • 1:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Earthquake : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం రాగా.. ఇండియా,చైనా,వియత్నా,బంగ్లాదేశ్‌లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ అఫ్గనిస్తాన్ లో భూకంపం వచ్చింది. ఉదయం 5.16 గంటలకు 180 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కూల్ పై 4.7 గా నమోదయ్యిందని వెల్లడించింది. జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎటువంటిఆస్తి నష్టం కానీ ప్రాణనష్టం జరిగలేదు.

మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది

భూకంపశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 4.3, 4.7 తీవ్రతతో వచ్చే భూకంపాలను మోడరేట్ భూకంపాలుగా వర్గీకరిస్తారు. ఇటువంటివి బలహీనమైన నిర్మాణాలు ఉన్న ప్రదేశాలలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాగా, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) నివేదిక ప్రకారం దీని కేంద్రం భూమికి 160 కి.మీ. దిగువన ఉంది. మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదయ్యింది.

150 మందికి పైగా మరణించారు

కాగా, నిన్న మయన్మార్ , బ్యాంకాక్ లో నిమిషాల వ్యవధిలోనే ఆరు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 150 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 700 మందికి పైగా గాయపడ్డారు. వందలాది బిల్డింగ్ లు కుప్పకూలాయి. ఎక్కడిక్కడ రోడ్లు,బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి. మయన్మార్‌లో తీవ్ర భూకంపం సంభవించిన దరిమిలా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శిథిలా కింద చిక్కుకున్న వాళ్లను కాపాండేందుకు రెస్క్యూ టీం సహాయం కొనసాగుతుంది.

afghanistan Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.