📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Faisal Karim: నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

Author Icon By Vanipushpa
Updated: December 31, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యార్థి నేత హాదీ(Hadi) హత్య కేసులో ఫైసల్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ లను బంగ్లాదేశ్ పోలీసులు అనుమానితులగా గుర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా పైసల్ దుబాయ్ లో ఉన్నట్లు వెల్లడైంది. ఈ హత్యతతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ అతడు ఓ వీడియోను విడుదల చేశాడు. వీడియోలో పైసల్ మాట్లాడుతూ..తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. దీని నుంచి తనని తాను రక్షించుకునేందుకు దుబాయ్ కు వచ్చినట్లు తెలిపాడు. జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపించాడు. ఈ సందర్భంఆ హాదీతో తనకు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని తెలిపాడు. ప్రభుత్వ కాంట్రాక్ట్ లు దక్కించుకోవడం కోసం హాదీ రాజకీయ కార్యకలాపాలకు తాను విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Read Also: America: సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

Bangladesh

భారత్ వైపు వేలెత్తి చూపిన బంగ్లా పోలీసులు

డిసెంబర్ 12వ తేదీన హాదీపై దాడి జరిగిన తర్వాత ఫైసల్, ఆలంగీర్ షేక్ వంటి నిందితులు దేశం దాటి పారిపోయారని పోలీసులు గుర్తించారు. వీరు భారత్‌లోకి ప్రవేశించారని.. ముఖ్యంగా మేఘాలయ సరిహద్దుల ద్వారా ఇండియాలోకి చొరబడ్డారని ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భారత భద్రతా దళాలు (BSF), మేఘాలయ పోలీసులు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ సరిహద్దు దాటి ఎవరూ భారత్‌లోకి రాలేదని.. బంగ్లాదేశ్ పోలీసులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నిందితుడు దుబాయ్ నుంచి వీడియో విడుదల చేయడంతో.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అతడిని పట్టుకునేందుకు ఢాకా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Business Opportunities comparison Cultural Differences culture dubai expat life global cities india Lifestyle Telugu News Paper Telugu News Today Tourism travel UAE

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.