Donald Trump: ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతమైన ఖర్గ్ ద్వీపంపై అవసరమైతే “సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటికే అమెరికా జరిపిన దాడుల్లో అక్కడ ఉన్న సైనిక లక్ష్యాలు చాలా వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Iran War: యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్
ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరిక
ఎన్బీసీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూతో పాటు, తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఈ విషయాలను పంచుకున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలు, క్షిపణి ముప్పులను అరికట్టేందుకు అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ ఆపరేషన్లను చేపట్టాయి. ఇందులో భాగంగానే మార్చి 13న ఖర్గ్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల ప్రభావం ఇరాన్ సైనిక శక్తిపై తీవ్రంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
ఆయిల్ ఎగుమతులపై నీలినీడలు
ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఖర్గ్ ద్వీపం నుంచే జరుగుతాయి. ఈ నేపథ్యంలో అమెరికా దాడులు ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తమ ఆయిల్ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం సైనిక స్థావరాలనే అమెరికా లక్ష్యం చేసుకుందని ఇరాన్ మీడియా వెల్లడించింది. దీనికి ప్రతిస్పందనగా, హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు ఇరాన్ అడ్డుతగిలితే, ఆయిల్ కేంద్రాలను కూడా వదలబోమని ట్రంప్ హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: