అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన న్యూయార్క్ టైమ్స్ (The New York Times) పై న్యాయపోరాటానికి దిగారు. దశాబ్దాలుగా ఆ పత్రిక తనపై ఉద్దేశపూర్వకంగా అబద్ధపు ప్రచారం చేస్తోందని,ఆరోపిస్తూ, ఏకంగా 15 బిలియన్ డాలర్లు (రూ.1.25కోట్లు) పరువు నష్టం దావా వేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వవేదికగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
తన కుటుంబంపై అసత్య ప్రచారాలు
న్యూయార్క్ టైమ్ పత్రిక ‘రాడికల్ లెఫ్ట్ డెమొక్రాటిక్ పార్టీ’ (‘Radical Left Democratic Party’)కి అధికారిక గొంతుకగా మారిపోయిందని ట్రంప్ విమర్శించారు. తనపై, తన కుటుంబంపై, తన వ్యాపారాలపై, ‘అమెరికా ఫస్ట్’, ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) ఉద్యమాలపై ఆ పత్రిక నిరంతరం అర్థాలు ప్రచురిస్తోందని ఆరోపించారు.
ఫ్లోరిడా రాష్ట్రం (State of Florida) లోని కోర్టులో ఈ దావాను దాఖలు చేసినట్టు ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ (Democratic Party) నేత కమలా హారిస్ (Kamala Harris) కు మద్దతుగా న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించడాన్ని ట్రంప్ తప్పుబట్టారు.
రికార్డు స్థాయిలో పరిహారం రాబట్టిన విషయాన్ని
గతంలో ఏబీసీ, సీబీఎస్ వంటి ఫేక్ న్యూస్ నెట్వర్క్స్ పై కూడా విజయవంతంగా కేసులు వేసి, రికార్డు స్థాయిలో పరిహారం రాబట్టిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ట్రంప్ తనకు వ్యతిరేకంగా పనిచేసే మీడియా సంస్థలు అయినా, దేశం అయినా తన కక్షను సాధించుకుని తీరుతారు. తనకు వ్యతిరేకంగా రాస్తున్న పత్రికలైనా,మీడియాలైనా వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ట్రంప్ దిట్ట అనే చెప్పాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: