हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Nobel Prize: నోబెల్‌ పురస్కారంకు తానే అర్హుడను ..డొనాల్డ్‌ ట్రంప్‌

Vanipushpa
Latest Telugu News: Nobel Prize: నోబెల్‌ పురస్కారంకు తానే అర్హుడను ..డొనాల్డ్‌ ట్రంప్‌

నోబెల్‌ శాంతి పురస్కారం(Nobel Peace) దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డు పొందిన వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా తనకు ఫోన్‌ చేశారన్న ట్రంప్ అది నాకు రావాల్సిన పురస్కారమని ఆమె స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. 2024 నుంచి 8 యుద్ధాలను ఆపానని మరోసారి పునరుద్ఘాటించారు. శాంతి కోసం చాలా చేశామని చెప్పుకునేవారు ఇన్ని యుద్ధాలను ఆపలేదని వ్యాఖ్యానించారు.

వెనుజువెలాలో వారికి సాయం అవసరం

‘ఇప్పటివరకు ఎనిమిది(యుద్ధాలు) ఆపాం. నిన్నటివరకూ ఏడు అని చెప్పా. కానీ అది ఎనిమిదికి చేరింది. మరొకటి ఆపేందుకు ఒప్పందం జరిగింది. నోబెల్‌ బహుమతి పొందిన మహిళ(మరియా కొరినా-మచాడో‌) నాకు ఫోన్ చేశారు. మీ గౌరవార్థం ఆ బహుమతిని అంగీకరిస్తున్నానని చెప్పారు. మీరు పూర్తిగా అర్హులని ఆమె స్వయంగా చెప్పారు. ఇది చాలా మంచి విషయం. అయితే దానిని నాకు ఇచ్చేమని నేను చెప్పను. దానికి ఆమె అర్హురాలేనని భావిస్తున్నాను. ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమెకు నేను చాలా సాయం చేస్తున్నాను. వెనుజువెలాలో వారికి సాయం అవసరం కూడా. నాకు 2024కు ఈ అవార్డు ఇవ్వాల్సింది.

France: ఫ్రాన్స్‌ ప్రధానిగా తిరిగి లెకోర్నుకే పగ్గాలు?

Nobel: నోబెల్‌ పురస్కారంకు తానే అర్హుడను ..డొనాల్డ్‌ ట్రంప్‌
Nobel: నోబెల్‌ పురస్కారంకు తానే అర్హుడను ..డొనాల్డ్‌ ట్రంప్‌

తనకు నోబెల్ శాంతి పురస్కారం రావడంపై మచాదో స్పందిస్తూ ఇది డొనాల్డ్ ట్రంప్​నకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పురస్కారం రావడాన్ని నమ్మలేకపోతున్నా. ఎన్నో కష్టాలు పడుతున్న వెనెజువెలా ప్రజలకు, తమ పోరాటానికి మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

తుది గడువు ముగిసిన తర్వాత నామినేషన్లు

అయితే నోబెల్ శాంతి పురస్కారం నామినేషన్లు ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్​నకే ఎక్కువగా వచ్చాయి. కానీ, వాటిలో అత్యధికంగా నామినేషన్ల తుది గడువు ముగిసిన తర్వాత వచ్చినవే. నోబెల్ నామినేషన్లు గడువు 2025 ఫిబ్రవరి 1 వరకు ఉంది. కానీ ఆ తర్వాత వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు, కంబోడియా ప్రధాని హున్‌ మనెత్, పాకిస్థాన్‌ ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి 1 తర్వాత నామినేషన్లు అందాయి. అయితే పలు అరబ్‌ దేశాలతో ఇజ్రాయెల్‌ సంబంధాలను సాధారణీకరించిన 2020 నాటి అబ్రహం ఒప్పందాలకు మధ్యవర్తిత్వం జరిపినందుకుగాను ట్రంప్‌నకు నోబెల్‌ ఇవ్వాలని నిరుడు డిసెంబరులో కూడా ప్రతిపాదన వచ్చింది. కానీ అది కమిటీ మనసు గెల్చుకోలేకపోయింది. శాంతి పురస్కారానికి ఈ ఏడాది మొత్తం 338 నామినేషన్లు వచ్చాయి.

రాజకీయ వివక్షను ప్రదర్శించింది

మరోవైపు, శాంతి బహుమతి విషయంపై అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం స్పందించింది. ఈ పురస్కార విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారని విమర్శించింది. నోబెల్‌ కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యమిచ్చిందని వైట్‌హౌస్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ స్టీవెన్‌ చుయెంగ్‌ అన్నారు. ప్రపంచ శాంతి కోసం నిజమైన నిబద్ధత చూపించిన వారిని పక్కనబెట్టి రాజకీయ వివక్షను ప్రదర్శించిందని విమర్శించారు. అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారని తెలిపారు. శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడుతారని అన్నారు.

నోబెల్ శాంతి బహుమతి విజేతల సంఖ్య?

నోబెల్ శాంతి బహుమతి దాని 124 సంవత్సరాల చరిత్రలో 142 మంది గ్రహీతలకు 105 సార్లు ప్రదానం చేయబడింది. 2025 నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ 10, శుక్రవారం ఉదయం 11:00 గంటలకు నార్వేలోని ఓస్లోలో (09:00 GMT) ప్రకటించనున్నారు.

ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన అనేక మంది నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖులు: మదర్ థెరిసా (1979), ఆంగ్‌సాన్ సూకీ (1991), షిరీన్ ఎబాదీ (2003), వంగరి మతాయ్ (2004), మరియు మరియా కొరినా మచాడో (2025). 2014లో బాలల హక్కుల కోసం కృషి చేసిన కైలాష్ సత్యార్థి కూడా ఈ బహుమతిని అందుకున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీని ప్రశంసలతో ముంచెత్తిన పుతిన్

మోదీని ప్రశంసలతో ముంచెత్తిన పుతిన్

సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కీలక వెబ్‌సైట్లు

సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కీలక వెబ్‌సైట్లు

ఇండిగో విమానాల రద్దు.. లక్ష దాటిన ఫ్లైట్ టికెట్ ధర

ఇండిగో విమానాల రద్దు.. లక్ష దాటిన ఫ్లైట్ టికెట్ ధర

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

📢 For Advertisement Booking: 98481 12870