న్యూయార్క్ (New York) నగరంలో ఇటీవల ఓ అరుదైన డైనోసార్ శిలాజాన్ని వేలం (Dinosaur fossil auctioned) వేశారు. ఆశించిన దాని కన్నా మించి ఈ శిలాజానికి గిరాకీ పెరిగింది. వేలంలో చివరకు ఈ పురాతన శిలాజం ఏకంగా 30.5 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఇది భారతీయ కరెన్సీలో చూస్తే దాదాపు రూ. 263 కోట్లకు సమానం.ఈ వేలాన్ని నిర్వహించింది ప్రసిద్ధ సోథ్ బీ సంస్థ. అరుదైన పురావస్తువుల వేలంలో ఈ డైనోసార్ శిలాజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలం ప్రారంభమైన వెంటనే దానికి ఉత్కంఠభరిత స్పందన వచ్చింది. కొనుగోలుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఒక రహస్య వ్యక్తి అతి భారీ ధరకు దీనిని సొంతం చేసుకున్నాడు.
ప్రపంచంలో మూడవ అత్యధిక ధర పలికిన శిలాజం
ఇది ప్రపంచంలో అత్యధిక ధర పలికిన డైనోసార్ అస్థిపంజరాలలో మూడవ స్థానాన్ని సంపాదించింది. గత సంవత్సరం జూలైలో ‘అపెక్స్’ అనే మరో డైనోసార్ శిలాజం 44.6 మిలియన్ డాలర్లకు విక్రయమైన సంగతి గుర్త Worth చేస్తే, అది రూ. 380 కోట్లకు సమానం.
కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు గోప్యం
ఈ విలువైన శిలాజాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను నిర్వహక సంస్థ వెల్లడించలేదు. భద్రతా కారణాల కారణంగా ఆయన పేరు గోప్యంగా ఉంచారు. దీని వయసు సుమారు 150 మిలియన్ సంవత్సరాలుగా అంచనా వేయబడుతోంది. ఇది జురాసిక్ యుగానికి చెందినదిగా భావిస్తున్నారు.
విజ్ఞానానికి అదనపు వనరు
ఈ డైనోసార్ శిలాజం ఇప్పుడు శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు విలువైన సమాచారం అందించే అవకాశముంది. భవిష్యత్తులో ఇది ఏ మ్యూజియంలో ప్రదర్శితమవుతుందో చూడాలి. విలువైన పురావస్తువుల ప్రపంచంలో ఇది మరో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
Read Also : Russia attack : ఉక్రెయిన్పై డ్రోన్లతో మళ్లీ రష్యా దాడి