షేక్ హసీనా ప్రతిజ్ఞకు ఢాకా ప్రభుత్వం కౌంటర్

Read Time:  1 min
Dhaka government counter to Sheikh Hasina's pledge
Dhaka government counter to Sheikh Hasina's pledge
FONT SIZE
GET APP

హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తాం..యూసన్‌ ప్రభుత్వం

ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను త్వరలో బంగ్లాదేశ్ కి తిరిగి వస్తా.. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించిన విషయం తెలిసిందే. తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు ముహమ్మద్ యూనస్ ఒక టెర్రరిస్ట్ అంటూ ఆరోపించారు. గతేడాది ఆగస్టు 5వ తేదీన వారు నన్ను చంపడానికి యత్నించారని చెప్పారు.. కానీ, నేను బతికి బయటపడ్డాను అని ఆమె పేర్కొన్నారు.

షేక్ హసీనా ప్రతిజ్ఞకు ఢాకా

ఉగ్రవాదుల ప్రభుత్వాన్ని గద్దె దించాలి

బంగ్లాలో అలర్లపై వేసిన అన్ని విచారణ కమిటీలను యూనస్ క్యాన్సిల్ చేశాడని చెప్పుకొచ్చింది. తనకు ఎదురు తిరిగిన వారిని చంపడానికి టెర్రరిస్టులను విడుదల చేశాడు.. వారు ఇప్పుడు బంగ్లాదేశ్ ని సర్వ నాశనం చేస్తున్నారు. ఈ ఉగ్రవాదుల ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేసింది. అవామీ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సహాయం చేసేందుకు చేయగలిగినదంతా చేస్తానని షేక్ హసీనా హామీ ఇచ్చింది.

హసీనాను వ్యక్తిగతంగా విచారించడానికి ప్రత్యేక ప్రణాళికలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యలకు తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రిని భారతదేశం నుంచి రప్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం.. హసీనాను వ్యక్తిగతంగా విచారించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇక, బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీకి రాజకీయ భవిష్యత్ లేదన్నారు. హత్యలు, బలవంతపు అరెస్టులకు పాల్పడిన వారు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలని యూనస్ వెల్లడించారు.

హసీనా పునరాగమనంపై పెరుగుతున్న ఉత్కంఠ

ఇదిలా ఉంటే, హసీనా వ్యాఖ్యలతో బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఆమె తిరిగి రావడం, ప్రతీకారం తీర్చుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల దేశంలో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే అవామీ లీగ్ పార్టీకి అనుకూలంగా ఉన్న వర్గాలు హసీనా పునరాగమనాన్ని స్వాగతించగా, మిగతా రాజకీయ పార్టీలు మాత్రం ఆమె ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

హసీనా ప్రతిజ్ఞకు ఢాకా ప్రభుత్వం కౌంటర్

ఈ నేపథ్యంలో “షేక్ హసీనా ప్రతిజ్ఞకు ఢాకా ప్రభుత్వం కౌంటర్” అంటూ తాత్కాలిక ప్రభుత్వం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హసీనాను దేశానికి రప్పించడమే కాకుండా, ఆమెపై ఉన్న కేసులను మరింత వేగవంతం చేయాలని యూనస్ ప్రభుత్వం యోచిస్తోంది.

అంతర్జాతీయ వర్గాల్లో చర్చ

బంగ్లాదేశ్ అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో కూడా ఈ పరిణామాలపై చర్చ జరుగుతోంది. హసీనా తిరిగి వస్తే దేశంలో దౌర్జన్యాలు పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులపై జరిగిన అరెస్టులు, హత్యల కేసులను యూనస్ ప్రభుత్వం మరింత వేగవంతం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భవిష్యత్తులో పెరిగే రాజకీయ ఉద్రిక్తతలు

హసీనా తిరిగి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో రాజకీయ మైనోద్యమాలు పెరిగే అవకాశముంది. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య విధానాల భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందనే దానిపై అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.