Deutsche Bank: భారత్ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమౌతున్న విదేశీ బ్యాంక్

Read Time:  1 min
Deutsche Bank
Deutsche Bank
FONT SIZE
GET APP

జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ డ్యూష్ బ్యాంక్(Deutsche Bank) భారత్‌లోని తన రిటైల్ మరియు వెల్త్ మేనేజ్మెంట్ కార్యకలాపాలను పూర్తి దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లాభదాయకతను పెంచడానికి సంస్థ చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా, భారత రిటైల్ సెగ్మెంట్ ఇకపై లాభాలు తీసుకురావడం లేదన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎనిమిదేళ్లలో రెండోసారి డ్యూష్ బ్యాంక్ ఈ విభాగం విక్రయంపై ఆలోచించడం, భారత్‌లో విదేశీ బ్యాంకులు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను స్పష్టంగా సూచిస్తోంది.

ఈసారి బ్యాంక్ విక్రయానికి ఉంచిన పోర్ట్‌ఫోలియో చిన్నది కాదు. వ్యక్తిగత రుణాలు, కొన్ని మోర్ట్గేజ్ ప్రొడక్ట్లు, అలాగే దాదాపు ₹25,000 కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తున్న వెల్త్ మేనేజ్మెంట్ వింగ్ ఇందులో భాగంగా ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ విభాగం ₹2,455 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇది గత ఏడాది కంటే 4% ఎక్కువ. మొత్తం రిటైల్ ఆస్తుల విలువ సుమారు ₹25,038 కోట్లు.

Read Also: కెంటకీ లో విమానం నుంచి ఎగసిపడిన మంటలు.. 14 మంది దుర్మరణం

Deutsche Bank
Deutsche Bank Foreign bank preparing to exit India

డిజిటల్ బ్యాంకింగ్‌లో దేశీయ బ్యాంకుల

ఈ పెద్ద పోర్ట్‌ఫోలియోపై భారతదేశంలోని రెండువేలు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు కోటక్ మహీంద్రా బ్యాంక్(Kotak Mahindra Bank) మరియు ఫెడరల్ బ్యాంక్ ఆసక్తి చూపుతున్నాయి. ఇరు సంస్థలు పోర్ట్‌ఫోలియోను పరిశీలించగా, ప్రస్తుతం ధరపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలిసింది. అయితే ఇరువైపులా ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. పరిశ్రమ వర్గాలు మాత్రం ఈ ఒప్పందం జరిగితే మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపవచ్చని భావిస్తున్నాయి.

భారతదేశంలో విదేశీ బ్యాంకులకు ఉన్న అతిపెద్ద సవాళ్లు స్థానిక బ్యాంకుల భారీ పోటీ, అధిక ఆపరేటింగ్ ఖర్చులు, పరిమితమైన బ్రాంచ్ నెట్‌వర్క్, అలాగే డిజిటల్ బ్యాంకింగ్‌లో దేశీయ బ్యాంకుల వేగవంతమైన ఎదుగుదల. ఈ నేపథ్యంలోనే 2022లో సిటీబ్యాంక్ తన రిటైల్ కార్యకలాపాలను యాక్సిస్ బ్యాంక్‌కు విక్రయించగా, అదే ఏడాది కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుండి ₹3,330 కోట్ల వ్యక్తిగత రుణ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసింది.

డ్యూష్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోపై కోటక్, ఫెడరల్ బ్యాంక్ చూపుతున్న ఆసక్తికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ డీల్ పూర్తయితే, ఇరువురు బ్యాంకులు ఒకేసారి భారీ సంఖ్యలో కొత్త కస్టమర్లను పొందడమే కాకుండా, అధిక విలువ కలిగిన వెల్త్ మేనేజ్మెంట్ క్లయింట్లు కూడా వీరి వ్యాపార విస్తరణకు పెద్ద బలం అవుతారు. రిటైల్ మరియు ప్రీమియం బ్యాంకింగ్ విభాగాల్లో తమ స్థిరీకరణను మరింత బలపర్చుకోవడానికి ఇది కీలకమైన అడుగు అవుతుంది. ఈ ఒప్పందం విజయవంతమైతే భారత రిటైల్ బ్యాంకింగ్ రంగంలో మరోసారి విశేష మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.