📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Delhi Protests: దీపు దాస్ హత్యపై ఢిల్లీలో భారీ నిరసనలు

Author Icon By Pooja
Updated: December 23, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యను నిరసిస్తూ న్యూఢిల్లీలో(Delhi Protests)ని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం మైమెన్సింగ్ జిల్లాలో ఇస్లామిస్ట్ గుంపు చేసిన దాడిలో దీపు దారుణంగా మృతి చెందడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Read Also: Bangladesh: మిషన్ భద్రతపై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు

Massive protests in Delhi over the murder of Deepu Das.

ఈ ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, ఆలయాల ధ్వంసం తక్షణమే నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీపు దాస్‌కు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

నిరసనల నేపథ్యంలో ఢిల్లీ(Delhi Protests) పోలీసులు హైకమిషన్ చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు వరుసల బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసు మరియు పారా మిలిటరీ దళాలను మోహరించారు. అయినప్పటికీ కొంతమంది నిరసనకారులు బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. “ఈ రోజు మనం మాట్లాడకపోతే, రేపు ప్రతి ఒక్కరూ దీపే అవుతారు” అంటూ ఒక నిరసనకారి చేసిన వ్యాఖ్య అక్కడి వాతావరణాన్ని మరింత ఉద్విగ్నం చేసింది.

ఈ నెల 19న బంగ్లాదేశ్ మైమెన్సింగ్ జిల్లా బలూకా ప్రాంతంలో 25 ఏళ్ల గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్‌పై దైవదూషణ ఆరోపణలతో గుంపు దాడి జరిగింది. అనంతరం అతని మృతదేహాన్ని తగలబెట్టిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పటివరకు కనీసం 12 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

ఇక భారత్‌లో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల ఎదుట జరిగిన నిరసనలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని భారత హైకమిషనర్‌ను పిలిపించి నిరసన తెలిపింది. దౌత్య కార్యాలయాలపై హింస, బెదిరింపులు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 20న ఢిల్లీలో జరిగిన నిరసన, 22న సిలిగురిలోని బంగ్లాదేశ్ వీసా కేంద్రంపై జరిగిన విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారత్‌ను కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BreakingNews DeepuChandraDas Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.