పాకిస్తాన్ తన సొంతదేశంలోనే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ప్రపంచదేశాలు ఎన్ని చీవాట్లు పెడుతున్నా, తనదేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు సంక్షోభంలో ఉన్నా పాక్ ప్రభుత్వానికి ఇవేవీ పట్టవు. పాకిస్తాన్ దృష్టి ఎప్పుడూ భారత్ పైనే ఉంటుంది. ఏవిధంగానైనా(Delhi Blast) భారతదేశాన్ని ఆర్థిక మూలాలను దెబ్బతీసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకే నిత్యం ప్రయత్నిస్తున్నది. ఇండియా ఆపరేషన్ సిందూర్ వార్ ద్వారా పాక్ కు బుద్ధి చెప్పినా.. ఇంకా ఆదేశ నేతల్లోకానీ, ఆర్మీలో కానీ ఎలాంటి మార్పులు రావడం లేదు. నిత్యం భారతదేశంపైనే నిందల్ని మోపేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా సాక్షాత్తు పాక్ జర్నలిస్ట్ పాకిస్తాన్ దుశ్చర్యలను వెలుగులోకి తెచ్చారు.
Read Also: Donald Trump: విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్

పాకిస్థాన్ ఆర్మీకి, ఉగ్రవాద సంస్థలకు కనెక్షన్లు ఉన్నాయని చెబుతున్నారు ఆ దేశ జర్నలిస్ట్ తాహా సిద్దిఖీ. తాజాగా జరిగిన ఢిల్లీ, ఇస్లామాబాద్(Islamabad) బాంబ్ పేలుళ్ల వెనుక కూడా ఆర్మీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఇస్లామిక్ టెర్రరిజాన్ని పాక్ ఆర్మీ ఉపయోగంచడం మానేసేంత వరకు దక్షిణ ఆసియా ప్రశాంతంగా ఉందని అంటున్నారు. దీన్నొక ఆయుధంగా ఆర్మీ ఉపయోగించుకుంటోందని.. దాని ద్వారా మిగతా దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటోందని సిద్దిఖీ ఆరోపిస్తున్నారు.
ఉగ్రవాదుల గ్రూపులతో ఆర్మీ డీల్
తన దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ అల్లకల్లోలం సృష్టించి దాని ద్వారా నెగ్గుకు రావాలని పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం చూస్తోందని తాహా సిద్ధిఖీ ఆరోపించారు. టెర్రరిస్టు(Delhi Blast) గ్రూపుల వెనుక పాక్ ఆర్మీ ఉంది కాబట్టే.. అవి వరుస దాడులకు పాల్పడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆర్మీ ఇచ్చిన ధైర్యంతోనే అవి రెచ్చిపోతున్నాయని సిద్ధిఖీ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ఎక్స్ లో పోస్ట్ రాశారు. ఆల్ ఖైదా ఉగ్రవాది మాట్లాడుతున్న వీడియోను కూడా తాహా సిద్ధిఖీ పోస్ట్ చేశారు. ఈ వీడియో ఒక్కటటి చాలు పాకిస్తాన్ ఆర్మీకి, ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉందని చెప్పడానికి అంటూ అందులో రాశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: