📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

India Covid: 1009కి చేరుకున్న కరోనా కేసులు

Author Icon By Shobha Rani
Updated: May 26, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ తర్వాత భారత్​లోనూ కోవిడ్ సోకిన వారిన సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 1009కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 752 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అలాగే, ప్రస్తుతం అత్యధికంగా కరోనా కేసులు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 430కి పెరిగాయి. గత 24 గంటల్లో కేరళలో 335 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం ప్రకారం, దేశంలో ప్రస్తుతం రెండు కొత్త వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ వేరియంట్లపై ఇంకా పూర్తి అధ్యయనం జరుగుతున్నప్పటికీ, వేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం జనంలో గుబులు పుట్టిస్తోంది. దేశంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.. కరోనా (Coronavirus) తో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు.. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా బాగా పెరిగింది.. చాప కింద నీరులా చల్లగా పాకేస్తోన్న కరోనా (Coronavirus) యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో వెయ్యి దాటిపోయింది.. తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో బాధితులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై కోవిడ్ నిబంధనల్ని, టెస్టులను చేయడం మొదలుపెట్టింది.

Coronavirus: దేశాన్ని కలవరపెట్టుతున్న కోవిడ్.. నలుగురు మృతి

గత వారం కొత్త కేసుల గణాంకాలు
దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి పైగా ఉంది. కేరళలో 403, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83, కర్నాటకలో 47, ఉత్తరప్రదేశ్ 15, పశ్చిమ బెంగాల్ లో 12 కరోనా (Coronavirus) కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మరణించారు. దేశంలోని కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత అధికంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనే వందకు చేరింది. దేశంలో గత వారం రోజులలో 752 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 335 కొత్త కేసులు మహారాష్ట్రలో 153 కేసులు, ఢిల్లీలో 99 కొత్త కేసులు వెలుగుచూశాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసంది. అన్ని సౌకర్యాలతో ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాలని సూచించింది.. రెండు కొత్త వేరియంట్లలో కరోనా (Coronavirus) ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం నిపుణులు గుర్తించారు.భారత్‌లో కరోనా మళ్లీ తీవ్రత పెంచుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య శాఖ సూచనలు పాటిస్తూ, సామూహిక భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కోవిడ్‌ను మరువకండి – అది తిరిగి మళ్లొస్తోంది.

Read Also: Operation Sindoor: పాకిస్థాన్‌పై భారత్ ప్రతిస్పందన..

Breaking News in Telugu Covid.. four dead Google news Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.