పాకిస్థాన్లోని (Pakistan) బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రస్తుతం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. పాకిస్థాన్ సైన్యం గత 40 గంటలుగా నిర్వహిస్తున్న ‘క్లియరెన్స్ ఆపరేషన్’లో (Clearance operation) ఇప్పటివరకు 145 మంది మిలిటెంట్లు హతమైనట్లు పాక్ ఆర్మీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
ఈ ఘర్షణల్లో భారీ ప్రాణనష్టం సంభవించడంతో పాటు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో 17 మంది లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, 31 మంది పౌరులు మృతి చెందినట్లు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫ్రాజ్ బుగ్టి వెల్లడించారు. పాకిస్థాన్ సైన్యం వివరాల ప్రకారం, శనివారం 92 మంది, శుక్రవారం 41 మంది ఉగ్రవాదులు మరణించారు.
Read also: TG: సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి ఆహ్వానం
బలూచిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు..పెరుగుతున్న ప్రాణనష్టం
ఎదురుకాల్పుల సమయంలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, దురదృష్టవశాత్తూ 18 మంది సాధారణ పౌరులు కూడా ఈ హింసకు బలైపోయారు. (Clearance operation) ఈ దాడులకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. తాము డజన్ల సంఖ్యలో పాక్ సైనికులను హతమార్చామని రెబల్స్ పేర్కొనడం గమనార్హం.
ప్రావిన్సు రాజధాని క్వెట్టాతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో మిలిటెంట్ల కుట్రలను అడ్డుకునేందుకు పాకిస్థాన్ సైన్యం కఠిన చర్యలు చేపట్టింది. క్వెట్టాలోని కీలక భవనాలు, ప్రధాన రహదారులను సైన్యం తన నియంత్రణలోకి తీసుకుంది. ముందస్తు జాగ్రత్తగా మొబైల్ ఫోన్ సేవలను పూర్తిగా నిలిపివేసి, రైలు రాకపోకలపై నిషేధం విధిస్తూ రవాణా వ్యవస్థను నిలిపివేశారు.
బలూచిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం క్వెట్టా మరియు పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొనగా, ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య జీవిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: