Pakistan : చైనా ఆయుధాల డొల్లతనం బయటపడిందన్న నిపుణులు

Read Time:  1 min
Pakistan : చైనా ఆయుధాల డొల్లతనం బయటపడిందన్న నిపుణులు
FONT SIZE
GET APP

ఇటీవల భారత్‌తో 96 గంటల సుదీర్ఘ యుద్ధం జరిగింది. ఈ సంఘర్షణపై పాకిస్థాన్‌ (Pakistan) కీలక వ్యాఖ్యలు చేసింది. వారు పూర్తిగా తమ దేశ వనరులపైనే ఆధారపడ్డామని ప్రకటించింది. ఇతర దేశాల సహాయం తీసుకోలేదని జాయింట్ చీఫ్స్‌ కమిటీ చైర్మన్‌ జనరల్‌ షంషాద్ మీర్జా (Shamshad Mirza) తెలిపారు.వారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వీరు కొన్ని ఆయుధాలు కొనుగోలు చేసినా, యుద్ధ సమయంలో దేశీయ వనరులే వాడాం, అని అన్నారు. భారత సైనిక శక్తికి తాము సమానమేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

పాక్ వ్యాఖ్యలపై నిపుణుల స్పందన

అయితే, పాక్‌ వ్యాఖ్యలు చాలామందికి ఒప్పుతలేకపోయాయి. నిపుణులైతే అవి పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని అంటున్నారు. పాక్‌ బలహీనతలు ‘ఆపరేషన్ సిందూర్’లో బయటపడ్డాయని స్పష్టం చేశారు.యుద్ధ నిపుణుడు జాన్ స్పెన్సర్ వివరించిన ప్రకారం, ఇది సాధారణ యుద్ధం కాదు. ఇది సాంకేతిక సామర్థ్యాల పోటీ. భారత్‌ ‘మేక్ ఇన్ ఇండియా’ ఆయుధాలతో చైనాకు చెక్ పెట్టింది. పాక్‌ వాడిన చైనా ఆయుధాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు.

చైనా టెక్నాలజీ – పాక్‌కు ఆశ్చర్యకర వైఫల్యం

సిప్రి నివేదిక ప్రకారం, పాక్ ఆయుధాల్లో 81% చైనా నుంచి వస్తోంది. ‘JF-17 థండర్’ యుద్ధవిమానం, ‘ఎల్‌వై-80’ గగనతల రక్షణ వ్యవస్థలు – ఇవన్నీ భారత్ దాడులను ఆపలేకపోయాయి.పాక్‌ టర్కీ నుంచి డ్రోన్లు తెచ్చుకుంది. కానీ వాటిని నడపడానికి టర్కీ ఆపరేటర్లే అవసరమయ్యారు. స్వీడిష్ సాబ్-2000 విమానం కూడా ధ్వంసమైంది. ఇది విదేశీ ఆయుధాలపై పాక్ ఆధారాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

వాస్తవాలను మలుపుతిప్పే పాక్ ప్రయత్నం

పాక్ తరచూ అబద్ధాలతో ప్రచారం చేస్తోంది. తప్పుడు వీడియోలు చూపించి ప్రజలను మోసం చేస్తోంది. నిపుణులు గుర్తుచేస్తున్నారు – ఒసామా బిన్ లాడెన్‌ను పాక్ ఎలా దాచిందో ప్రపంచమే చూశింది.

Read Also : Imran Khan : మునీర్ పై ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.