భారత పొరుగుదేశం చైనా..అగ్రరాజ్యం అమెరికాకు ధీటైన వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచానికి చైనా ముప్పు అనే ప్రచారాన్ని అమెరికా వెంటనే మానుకోవాలని చైనా తెలిపింది. తైవాన్పై వచ్చే ఏడాదిలో చైనా దాడి చేసే ప్రణాళిక ఏదీ లేదంటూ మార్చి 19, 2026 గురువారం చైనా.. అమెరికాకు స్పష్టమైన వార్నింగ్ను పంపింది. ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు అమెరికా జాగ్రత్తగా వ్యవహరించాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) విలేకరుల సమావేశంలో అన్నారు. అమెరికా ‘చైనా ముప్పు’ అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని, చైనా సంబంధాలను సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన వెల్లడించారు. లిన్ జియాన్ ప్రకటనల ప్రకారం.. అపోహలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఘాటుగా హెచ్చరించింది. చైనా, తైవాన్ సమస్యను చట్టపరంగా పరిష్కరించాలన్న దృక్పథంలో, ఏకపక్షంగా ఉద్దేశపూర్వక ప్రయత్నాలు కాకుండా, సమగ్ర పరిపాలన, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం సాధించాలనే ఆవశ్యకతను గుర్తించింది. ఈ ప్రకటనలో, చైనా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి అన్ని పక్షాలకు సంయమనాన్ని పాటించాలని సూచించింది.
Read Also: Fuel Crisis: భారత్లో ఇంధన కొరత రాకుండా ముందస్తు జాగ్రతలు!

ఇక అంతర్జాతీయ సంఘర్షణల విషయానికి వస్తే..
ఇటీవల ఇజ్రాయెల్ ఒక సీనియర్ ఇరాన్ నాయకుడు అలీ లారిజానీని హత్య చేసిన వైమానిక దాడిని చైనా తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సంబంధాలలో బలప్రయోగం ఎల్లప్పుడూ అస్వీకార్యమని, ఇరాన్ దేశాధినేతల హత్యలు, పౌర లక్ష్యాలపై దాడులు ఏ విధంగానూ ఆమోదయోగ్యంలేవని లిన్ జియాన్ స్పష్టం చేశారు. చైనా అన్ని పక్షాలను సైనిక చర్యలను నిలిపి, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నివారించమని కోరింది. హార్ముజ్ జలసంధి వివాదం..అమెరికాకు చైనా బిగ్ షాక్.. వెంటనే సైనిక చర్యలు ఆపాలని డిమాండ్.. మధ్యప్రాచ్యంలో చైనా సానుకూల దౌత్య సంబంధాలు జరుపుతోంది. ప్రత్యేక రాయబారి జై జున్ ప్రాంతీయ అధికారులతో చర్చలు నిర్వహించి, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని మానుకోవాలని, కీలక నౌకా మార్గాలను రక్షించాలని ధృవీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: