అమెరికాకు ఎగుమతి చేస్తే సరఫరా ఆపేస్తాం” – భారత్కు చైనాతో హెచ్చరిక, అరుదైన ఖనిజాలపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి
China India : ప్రపంచంలో Rare Earth Magnets ఉత్పత్తిలో చైనా దాదాపు 90% నియంత్రణ కలిగి ఉంది. ఈ అరుదైన ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, హై-టెక్ పరిశ్రమల కు కీలకమైన ముడిసరుకులు. (China India) ఇవి లేకుండా ఆటోమొబైల్, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల ఉత్పత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
తాజాగా చైనా, భారతదేశానికి ఈ ఖనిజాలను సరఫరా చేయడానికి ముందు ఒక హామీ (Assurance) కోరింది. అమెరికాకు ఈ అయస్కాంతాలను తిరిగి ఎగుమతి చేయకుండా, దేశీయ అవసరాలకే పరిమితం చేయాలని షరతు పెట్టింది.
Read also : ప్రత్యేక వేదిక పై భాదిత కుటుంబాలను కలవనున్న విజయ్
భారత కంపెనీలు ఇప్పటికే End-User Certificates (EUC) సమర్పించి, ఈ ఖనిజాలను విధ్వంసక ఆయుధాల తయారీలో ఉపయోగించబోమని హామీ ఇచ్చాయి. అయినప్పటికీ, చైనా అదనంగా భరోసా కోరుతోంది.
ET నివేదిక ప్రకారం, చైనా–అమెరికా మధ్య రేర్ ఎర్త్ ఒప్పందాల నేపథ్యంలో, భారత్ కూడా Wassenaar Arrangement Framework విధానాన్ని అనుసరిస్తోంది. ఇది 42 దేశాల మధ్య భద్రతా ఉద్దేశాలతో ద్వంద్వ-ఉపయోగ సాంకేతికతల నియంత్రణకు ఏర్పాటైన ఒప్పందం. అయితే చైనా ఆ ఒప్పందానికి సభ్యురాలు కాదు. అందుకే భారత్ సరఫరా చేసే ఖనిజాలు అమెరికాకు మళ్లీ ఎగుమతి కాకూడదని స్పష్టం చేసింది.
ఆగస్టులో జరిగిన షాంఘై సహకార సదస్సు (SCO) తర్వాత చైనా భారత్కు తేలికపాటి rare earth magnets సరఫరాను పునరుద్ధరించింది. కానీ భారీ రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరా ఇంకా నిలిచిపోవడంతో, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, బస్సులు, ట్రక్కులు, ఆటోమొబైల్ మోటార్లు వంటి రంగాలు ప్రభావితమవుతున్నాయి.
ఈ అయస్కాంతాలు వాహనాల వేగ నియంత్రణ, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలు వంటి కీలక భాగాల్లో ఉపయోగిస్తారు.
ఏప్రిల్ 4న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై కొత్త సుంకాలు విధించిన తర్వాత, చైనా జాతీయ భద్రతా కారణాలు చూపిస్తూ, మధ్యస్థ మరియు భారీ రేర్ ఎర్త్ ఉత్పత్తులపై ఎగుమతి పరిమితులు విధించింది.
ఎగుమతిదారులు EUC ధృవీకరణ పొందిన తర్వాత మాత్రమే చైనా వాణిజ్య విభాగం (MOFCOM) నుండి లైసెన్స్ పొందగలుగుతున్నారు. యూరప్, ఆగ్నేయాసియా కంపెనీలకు సరఫరా తిరిగి ప్రారంభమైనప్పటికీ, భారత కంపెనీలు ఇంకా లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్నాయి.
FY25లో భారత్ మొత్తం 870 టన్నుల రేర్ ఎర్త్ మాగ్నెట్లు దిగుమతి చేసుకుంది, వీటి విలువ సుమారు ₹306 కోట్లు.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, చైనా భారత్పై స్పష్టమైన డిమాండ్ పెట్టింది – ఈ ఖనిజాలను అమెరికాకు తిరిగి ఎగుమతి చేయకూడదు, దేశీయ అవసరాలకే వినియోగించాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :