తైవాన్ సరిహద్దుల్లో చైనా(taiwan-china) రెండవ రోజు కూడా భారీ సైనిక విన్యాసాలను కొనసాగిస్తోంది. ఈ విన్యాసాల ఉద్దేశం తైవాన్(taiwan) వేర్పాటువాద శక్తులకు, వారిని ప్రోత్సహిస్తున్న ‘బాహ్య శక్తులకు’ స్ట్రాంగ్ వార్నింగ్ పంపడమేనని చైనా స్పష్టం చేసింది. చైనా(China Military Drill) తన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఆధ్వర్యంలో ‘జస్టిస్ మిషన్ 2025’ పేరుతో ఈ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తోంది. రెండవ రోజైన మంగళవారం (డిసెంబర్ 30, 2025), చైనా సైన్యం తైవాన్ చుట్టూ వాయుసేన, నౌకాదళం, రాకెట్ ఫోర్స్ యూనిట్లను రంగంలోకి దించింది. ఈ డ్రిల్స్లో సముద్ర, గగనతలంలో లైవ్-ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. చైనా(China) రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జాంగ్ జియావోగాంగ్ మాట్లాడుతూ.. “చైనా కోర్ ప్రయోజనాలను సవాలు చేసే ఏ ప్రయత్నాన్నైనా తాము సహించబోమని, తైవాన్ ద్వారా చైనాను అణచివేయాలని చూస్తున్న దేశాలు తమ భ్రమలను వీడాలని” హెచ్చరించారు.
Read Also: America: రెండు హెలికాప్టర్లు ఢీ.. వీడియో వైరల్
తైవాన్కు ట్రంప్ 11.1 బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీ
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్కు సుమారు 11.1 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధ ప్యాకేజీని ప్రకటించారు. ఇది తైవాన్ చరిత్రలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా భావిస్తున్నారు. తైవాన్పై దాడి జరిగితే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని జపాన్ ప్రధాని సనాయె తకాయిచి చేసిన వ్యాఖ్యలు బీజింగ్ను ఆగ్రహానికి గురిచేశాయి. చైనా చర్యలను తైవాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తైవాన్ తన సైనిక బలగాలను అత్యున్నత అప్రమత్తతలో ఉంచింది. ఈ విన్యాసాల కారణంగా తైవాన్ జలసంధి మీదుగా వెళ్లే అంతర్జాతీయ విమాన మార్గాలను మళ్లించాల్సి వచ్చింది. దీనివల్ల సుమారు 1,00,000 మంది అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రభావం పడింది. దాదాపు 850 అంతర్జాతీయ, 80 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: