అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు అత్యంత సన్నిహితుడు, కన్సర్వేటివ్ రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ (32) దారుణహత్య గురయ్యారు. ఉటాకౌంటీలోని వర్సిటీలో ఆయనప్రసంగిస్తున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆయనను తుపాకీతో కాల్చాడు. దీంతో రక్తపు మడుగులో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటన యావత్ అమెరికాను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే భారతదేశంపై తీవ్ర విద్వేషాన్ని కలిగిన చార్లీ హత్య తీవ్ర కలకలానికి కారణమైంది.
చార్లీ కిర్క్ మరణంతో తీర్చచర్చలు
చార్లీ కిర్క్ (Charlie Kirk) మరణం అమెరికాలో రాజకీయ హింసపై తీవ్ర చర్చకు దారి తీసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ పై కాల్పులు జరగగా, ఆ తర్వాత ఇలాంటి,దాడులు మూడు నాలుగు జరిగాయి. అయితే కిర్ను చంపేంత పగ, కోపం ఎవరికి ఉన్నాయనే ప్రశ్నలు సర్వత్రా నెలకొన్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి,తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు కాల్చిన వ్యక్తి ఎవరో నిర్ధారించబడలేదు.
అలాగే కారణం కూడా తెలియరాలేదు. కొంతమంది పేర్లుసోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నప్పటికీ, వాటిని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కానీ ఆ వ్యక్తి పేరు, వివరాలు వెల్లడించలేదు. అదే సమయంలో ఉటాకౌంటీ వర్సిటీ వద్ద ఒక వృద్ధ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భారతీయులపై విద్వేషం
కాగా చార్లీ కిర్క్ భారతీయ వలసదారులపై ‘అమెరికా ఈజ్ ఫుల్’ (‘America is full’) అంటూ ఆ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రపాయి. భారత్ నుంచి వలస వచ్చినవాళ్లు అమెరికన్ల,ఉద్యోగాలను కబ్జా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారాయన. దీనిపై ఇండో అమెరికన్ కమ్యూనిటీ, టెక్ కమ్యూనిటీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆయన తొలి నుంచి అమెరికన్ ఫస్ట్ భావజాలం ప్రదర్శిస్తుండడంతో ఆ సమయంలో అక్కడి యువత ఆయనకు అండగా నిలబడింది. ఈక్రమంలో భారతీయులకు వీసాలు ఇవ్వొద్దంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
భవనంలో దాక్కుని కిర్క్ కాల్పులు
హత్యకు గురైన చార్లీ కిర్క్ మృతిపై అమెరికా ఎఫ్బీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. కిర్క్ మాట్లాడుతున్న ప్రాంతానికి 100 గజాల దూరంలో ఉన్న భవనం రూఫప్ నుంచి కాల్పులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఆ భవనం మీద దుండగుడు దాక్కొన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. చార్లీ కిర్క్ ఇటీవల యేసుక్రీస్తు గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.
యేసుక్రీస్తు తనను రక్షించాడు, బైబిల్ సత్యవేదం అంటూ తీవ్రస్థాయిలో తనదైనశైలిలో ఆయాసభల్లో ప్రసంగాలు ఇచ్చారు. కాల్పులో కిర్క్ మరణించడంతో ఈ ఉదంతంపై భారతయులపై విద్వేషాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నందున అధికారులు శాంతిభద్రలకు విఘాతం కలగకుండా కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: