హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని సమర్థించుకోవడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే హెచ్-1బీ వీసా విధానంపై వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్(Caroline Leavitt) స్పందించారు. వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, దీంతో అమెరికన్ల వేతనాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. వైట్హౌస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. ‘ఈ పిటిషన్లపై కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం.
Read Also: Visa: కొత్త విధానంలో వీసా మార్పులతో స్వాగతం పలుకుతున్న కెనడా

అమెరికన్ల వేతనాలు తగ్గాయి
చాలా కాలంగా హెచ్-1బీ వీసా వ్యవస్థ మోసాలతో నిండిపోయింది. దీంతో అమెరికన్ల వేతనాలు తగ్గాయి. అందుకే ఈ కొత్త విధానాలు అమలయ్యాయి. ఇవి చట్టబద్ధమైనవి. వీటి కోసం కోర్టులో పోరాటం కొనసాగిస్తాం’ అని లివిట్ పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిర్ణయం వీసా వ్యవస్థను దెబ్బతీస్తోందని అమెరికా చాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ పేర్కొన్నారు. ‘ఈ కొత్త లక్ష డాలర్ల వీసా ఫీజు చిన్న, మధ్య తరహా కంపెనీలకు పెద్ద భారం అవుతుంది.
ఆర్థిక వృద్ధికి మరిన్ని ఉద్యోగులు అవసరం
ట్రంప్ పన్ను సంస్కరణలు, అమెరికన్ ఎనర్జీ వృద్ధి, నియంత్రణ తగ్గింపు వంటి ప్రోత్సాహక చర్యలు చేపట్టారు. ఈ చర్యలు దేశంలో పెట్టుబడులు పెరగడానికి దోహదపడ్డాయి. ఆర్థిక వృద్ధికి మరిన్ని ఉద్యోగులు అవసరం, తక్కువ కాదు’ అని తెలిపారు. కాలిఫోర్నియా, వాషింగ్టన్ డీసీలో కూడా యూనియన్లు, సంస్థలు, పలు సంఘాలు ఫీజును పెంచడం చట్టవిరుద్ధమని పిటిషన్ను దాఖలు చేశాయి. దీనిని ఏకపక్షంగా, మోసపూరితంగా ఉందని పేర్కొన్నాయి. హెచ్-1బీ వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది.
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు
అయితే, హెచ్-1బీ వీసా ఫీజు ఇప్పటివరకు దాదాపు రూ.1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండేది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఆ ఫీజును రూ.88 లక్షలకు పెంచింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత దీనిపై స్పందించిన అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే హెచ్-1బీ వీసాలు కలిగి ఉన్న వారికి వర్తించదని పేర్కొంది. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము లక్ష డాలర్లు ఉంటుందని వైట్హౌస్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది.
కరోలిన్ లెవిట్ ఎవరు?
కరోలిన్ క్లైర్ లీవిట్ జననం ఆగస్టు 24, 1997) ఒక అమెరికన్ రాజకీయ ప్రతినిధి, ఆమె 2025 నుండి రెండవ ట్రంప్ పరిపాలనలో 36వ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: