Cargo ship attack: పశ్చిమాసియాలో రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య సముద్ర మార్గంలో మరో ఘోరం జరిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలో భారతదేశానికి వస్తున్న ఒక భారీ కార్గో నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అంతర్జాతీయ నౌకాయాన రంగంలో తీవ్ర కలకలం రేపింది.
రాయల్ థాయ్ నేవీ వెల్లడించిన వివరాల ప్రకారం.. థాయ్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్టు నుంచి బయలుదేరింది. ఇది గుజరాత్లోని కాండ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యలో హర్మూజ్ జలసంధి వద్ద ఈ దాడి జరిగింది.
Read Also: Youssef Pejeskian: మొజ్తాబా ఖమేనీ సురక్షితంగా ఉన్నారు
ఈ దాడి జరిగిన సమయంలో నౌకలో ఉన్న సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 20 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడగా, ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ దాడికి గల కారణాలు లేదా దీని వెనుక ఉన్న శక్తుల గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: