థాయ్ లాండ్-కంబోడియాలు(Cambodia) ‘తక్షణ కాల్పుల’ విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలు ఈ మేరకు కంబోడియాలో రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రాణాంతక సరిహద్దు ఘర్షణలకు ముగింపు పలుకుతామని రెండు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. పొరుగువారి దీర్ఘకాల సరిహద్దు వివాదం ఈ నెలలో తిరిగి ప్రారంభమైంది. అధికారిక లెక్కల ప్రకారం, మునుపటి కాల్పుల విరమణను విచ్చిన్నం చేసి, కనీసం 47 మందిని చంపింది. దాదాపు పదిలక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Read Also: America: కాల్పులు, ఉగ్రవాద బెదిరింపుల కేసులో భారత విద్యార్థి అరెస్టు
ఉమ్మడి ప్రకటనపై సంతకం
ఈ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసిన తర్వాత, డిసెంబరు 27,2025న మధ్యాహ్నం 12 గంటల నుండి (స్థానిక సమయం) అమలులోకి వచ్చే తక్షణ కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. (Cambodia) ఇందులో పౌరులు, పౌర వస్తువులు, మౌలిక సదుపాయాలపై దాడులు, ఇరు వైపుల సైనిక లక్ష్యాలు అన్ని సందర్భాలలో, అన్ని ప్రాంతాలలో అన్ని రకాల ఆయుధాలు ఉంటాయి’ అని రెండు దేశాల రక్షణ మంత్రులు సంతకం చేసి, సంయుక్త ప్రకటనను విడుదల చేసింది.
యునైటెడ్ స్టేట్స్, చైనా, మలేషియా దేశాల ఒత్తిడితో కాల్పుల విరమణ
సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు వీలైనంత త్వరగా తమ స్వదేశానికి తిరిగి రావడానికి, దళాల కదిలికలకు స్తంభింపజేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ఆ ప్రకటన తెలిపింది. మందుపాతలను తొలగించడం, సైబన్ నేరాలను ఎదుర్కోవడంలో సహకరించడానికి కూడా వారు అంగీకరించారు. రెండు దేశాల భాగస్వామ్య సరిహద్దులో వివాదాస్పత ప్రాంతాలలోని పురాతన దేవాలయాల చిన్న ముక్కల కోసం జరుగుతున్న పోరాటాన్ని ముగించడానికి కాల్పుల విరమణ ఈ మధ్యాహ్నం నుంచి అమల్లోకి వస్తుంది. కంబోడియా, థాయ్ లాండ్(Thailand) సభ్యులుగా ఉన్న ఆగ్నేయాసియా దేశాల సంఘం విదేశాంగ మంత్రుల సంక్షభ సమావేశం తర్వాత మూడురోజుల సరిహద్దు చర్చలు ప్రకటించిన తర్వాత ఇది వచ్చింది. యునైటెడ్ స్టేట్స్, చైనా, మలేషియా దేశాలు కాల్పుల విరమణపై ఒత్తిడిని తీసుకొచ్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: