విమానంలో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ భారతీయుడికి యూకే కోర్టు 21 నెలల జైలు శిక్ష విధించింది. ముంబైకి చెందిన షిప్పింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ జావేద్ ఇనామ్దార్ (34) 2024 డిసెంబర్ 14న ముంబై నుంచి లండన్(London) వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితుడు జావేద్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read also: Railway: టికెట్ బుకింగ్ వ్యవస్థలో మార్పులు

విమానంలో అసభ్య ప్రవర్తన, సిబ్బంది జోక్యం
‘ది సన్’ పత్రిక కథనం ప్రకారం, విమానంలో తన పక్క సీట్లో నిద్రిస్తున్న బాలిక పట్ల జావేద్ అసభ్యంగా ప్రవర్తించాడు. మొదట ఆమె చేతిని నిమిరి, ఆ తర్వాత ఆమె దుస్తుల్లో చేయి పెట్టాడు. దీంతో ఉలిక్కిపడి నిద్రలేచిన ఆ బాలిక “నా దగ్గరి నుంచి వెళ్ళిపో” అంటూ గట్టిగా అరుస్తూ ఏడ్చేసింది. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది, బాలికను విచారించగా జరిగిన విషయం చెప్పింది. క్యాబిన్ మేనేజర్ రెబెక్కా రూనీ కోర్టుకు(court) తెలిపిన వివరాల ప్రకారం, ఆ బాలిక తీవ్ర భయాందోళనతో కనిపించింది. నిందితుడిని ప్రశ్నించగా, తన భార్య అనుకుని పొరపాటున తాకినట్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
కోర్టులో వాదనలు, జడ్జి వ్యాఖ్యలు
ఐల్స్వర్త్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణలో నిందితుడు హిందీ అనువాదకుడి సహాయం తీసుకున్నాడు. అతని తరఫు న్యాయవాది వాదిస్తూ, నిందితుడు భారతదేశంలోని భిన్నమైన సంస్కృతి నుంచి వచ్చాడని, అతని శిక్షను నిలిపివేస్తే వెంటనే దేశం విడిచి వెళ్లిపోతాడని కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వాదనలను జడ్జి సైమన్ డేవిస్(Judge Simon Davies) తీవ్రంగా ఖండించారు. “భార్య అనుకున్నాననే వాదన నమ్మశక్యంగా లేదు. ఇది దారుణమైన చర్య. ఇలాంటి వారి నుంచి ఈ దేశం చిన్నారులను కచ్చితంగా కాపాడుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. నిందితుడు చాలాకాలంగా యూకేలో ఉండటాన్ని మానవతా దృక్పథంతో పరిగణలోకి తీసుకుని శిక్షను కొంత తగ్గించినట్లు తెలిపారు. విచారణ అనంతరం ఇనామ్దార్ను దోషిగా నిర్ధారించిన కోర్టు, అతనికి 21 నెలల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also: