ప్రపంచ స్టీల్ రంగంలో ప్రముఖుడైన ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ (Laxmi mittal) బ్రిటన్కు గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. యూకే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పన్ను విధానాలు, ముఖ్యంగా నాన్-డోమ్ టాక్స్ రద్దు నిర్ణయం, ఈ మార్పుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. విదేశాల్లో సంపాదించే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వలన గతంలో అనేక ధనవంతులు లండన్ను కేంద్రంగా ఎంచుకున్నారు, అయితే ఇప్పుడు ఆ సౌకర్యం పూర్తిగా తీసేయబడుతోంది.
Read also: Elon Musk: వైరల్ అవుతున్న టెక్ దిగ్గజాల ఏఐ ఫొటోలు
Lakshmi Mittal to say goodbye in the UK
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టంగా
ఈ మార్పులు మిత్తల్ వంటి గ్లోబల్ బిలియనీర్ల భవిష్యత్ వ్యూహాలను ప్రభావితం చేస్తున్నాయి. పన్ను భారాన్ని తగ్గించుకోవాలనుకునే ధనవంతులు దుబాయ్, సింగపూర్, మోనాకో వంటి పన్ను సౌకర్యాలు కలిగిన ప్రాంతాల వైపు చూస్తున్నారు. దుబాయ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండడంతో మిత్తల్ కూడా భవిష్యత్ వ్యాపార కార్యకలాపాలను అక్కడికి మార్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టీల్ సంస్థకు 40% వాటా ఉన్న మిత్తల్ కుటుంబం ఈ నిర్ణయంతో గ్లోబల్ పెట్టుబడి దిశను మార్చే అవకాశముంది.
యూకే సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న లక్ష్మీ మిత్తల్ వంటి బిలియనీర్ల బయలుదేరటం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టంగా పరిగణిస్తున్నారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, వ్యాపార ప్రవాహం ఇతర దేశాలకు మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే పన్ను విధానం రద్దుపై గతంలో సునాక్ భార్య అక్షతా మూర్తి వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంతోమంది ధనవంతులు యూకేను విడిచి గల్ఫ్ దేశాల వైపు వెళ్లడం బ్రిటన్ వ్యాపార వాతావరణంపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: