Bolivia plane crash : కరెన్సీ నోట్లు మోసిన విమానం కూలింది, 15 మంది మృతి

Read Time:  1 min
Bolivia plane crash
Bolivia plane crash
FONT SIZE
GET APP

Bolivia plane crash : దక్షిణ అమెరికా దేశమైన Boliviaలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తున్న బొలివియన్ సైనిక కార్గో విమానం అదుపుతప్పి కూలిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం రాజధాని La Paz సమీపంలోని ఎల్ ఆల్టో ప్రాంతంలో జరిగింది. శాంటా క్రూజ్ నగరం నుంచి బయలుదేరిన ఈ మిలిటరీ విమానం ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి నేలకూలింది. ప్రమాదం తర్వాత విమానం హైవేపైకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది.

Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

Bolivia plane crash
Bolivia plane crash

విమానం కూలిన ప్రాంతంలో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు గుమిగూడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రమాదం అనంతరం El Alto International Airportను తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై బొలీవియా రక్షణ శాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేదా సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.