ఆఫ్రికాలోని మొజాంబిక్(Mozambique) బెయిరా ఓడరేవు సమీపంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ విషాద ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. 14 మంది భారతీయ సిబ్బందితో సహా మరికొందరు ఆ బోట్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిగిలిన వాళ్లని స్థానిక సిబ్బంది రక్షించారు. అయితే బోటు బోల్తా పడేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. గల్లంతైన వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Read Also: Telangana Bandh: పండగ రద్దీతో నిలువున దోచుకున్న క్యాబ్ డ్రైవర్లు
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు భారత హైకమిషన్ పేర్కొంది. అలాగే మృతుల కుటుంబాలకు, వాళ్లకి కావాల్సిన సాయాన్ని అందిస్తున్నామని తెలిపింది. మృతుల పేర్లు, వివరాలపై ఇంకా స్పష్టత లేదు. గల్లంతైన వాళ్ల కోసం స్థానిక అధికారుల, సముద్ర సంస్థలతో పాటు భారత దౌత్య కార్యాలయం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి అత్యవసర నెంబర్లను కూడా హైకమిషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మొజాంబిక్ దేనికి ప్రసిద్ధి చెందింది?
మొజాంబిక్లో చేయవలసిన టాప్ 10 ఉత్తమ విషయాలు - సఫారీబుకింగ్స్
మొజాంబిక్ 2,500 కిలోమీటర్ల అద్భుతమైన తీరప్రాంతానికి ప్రసిద్ధి చెందింది, ఇందులో సహజమైన బీచ్లు మరియు శక్తివంతమైన హిందూ మహాసముద్ర సముద్ర జీవులు ఉన్నాయి,
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: