బంగ్లాదేశ్ (Bangladesh) రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించడం దక్షిణాసియా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, బీఎన్పీ అధినేత తారిక్ రహ్మాన్ కు శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also: NASA swift observatory : భూమివైపు జారుతున్న నాసా స్విఫ్ట్ టెలిస్కోప్
గురువారం బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ పార్టీ 300 స్థానాల పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీని కైవసం చేసుకుంది.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు.
“బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీని ఘన విజయపథంలో నడిపించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూపుతోంది. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుంది. ఇరుదేశాల మధ్య బహుముఖ సంబంధాలను బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.
తారిక్ రెహమాన్ అఖండ విజయం..
బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె కుమారుడు తారిక్ రెహమాన్.. ఈ ఎన్నికల్లో రెండు చోట్ల (ఢాకా, బొగ్రా) పోటీ చేసి రెండింటిలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దాదాపు 17 ఏళ్ల పాటు లండన్లో ఉన్న ఆయన.. గతేడాది డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వచ్చారు. బీఎన్పీ ఇప్పటికే తారిక్ రెహమాన్ను తమ తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తన గెలుపును ఉద్దేశించి తారిక్ రెహమాన్ మీడియో మాట్లాడుతూ.. ప్రజలు మార్పును కోరుకున్నారు. ఈ విజయం బంగ్లాదేశ్ భవిష్యత్తును మారుస్తుందంటూ కామెంట్లు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: