పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో పాకిస్థాన్(Pakistan) అలర్ట్ అయింది. పాక్లోని క్వెట్టా(Kevktta) నగరంలో మంగళవారంనాడు ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డుమార్గంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు అనంతరం కాల్పుల మోతలు వినిపించాయి. ఈ ఘటన అనంతరం నగరంలోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ(Emergency) ప్రకటించారు.

పేలుడు పై స్పందించిన బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి
ప్రధాన రహదారి మీద జరిగిన ఈ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. బాంబుపేలుడు దాటికి ఆరుగురు మృతిచెందగా, 19 మంది గాయపడినట్టు పోలీసులు చెప్పారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది.
మారిన ముఖ్య ఆర్థిక, రైల్వే, ఆన్లైన్ రూల్స్
పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు పై స్పందించిన బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి భక్త్ మహమ్మద్ కాకర్ సిటీలోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. లీవులో ఉన్న కన్సల్టెంట్లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తక్షణం డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
పేలుడు దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు
కాగా ఈ పేలుడుకు కారణం ఆత్మాహుతి దాడి కావచ్చని పాకిస్థాన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. పేలుడు అనంతరం చుట్టుపక్కల పెద్దఎత్తున పొగలు వ్యాపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా పేలుడు దృశ్యం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. సెప్టెంబర్ 4న కూడా క్వెట్వాలో ఒక పొలిటికల్ ర్యాలీ నిర్వహిస్తుండగా కూడా బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. కాగా ప్రస్తుత పేలుడుకు కారణం ఎవరన్నది తెలియాల్సి ఉంది.
పాకిస్తాన్ పితామహుడు ఎవరు?
పాకిస్తాన్ చరిత్ర (1947–ప్రస్తుతం)
ముహమ్మద్ అలీ జిన్నా
1956 రాజ్యాంగం పాకిస్తాన్ను ఇస్లామిక్ ప్రజాస్వామ్య దేశంగా మార్చింది. పాకిస్తాన్ వ్యవస్థాపక తండ్రి మరియు భవిష్యత్ గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నాతో పాకిస్తాన్ తొలి దశాబ్దాల రాజనీతిజ్ఞులు.
పాకిస్తాన్లో ప్రధాన మతం ఏమిటి?
పాకిస్తాన్ ఇస్లామిక్ వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం | హఫ్పోస్ట్ సహకారి
పాకిస్తాన్లో ప్రధాన మతం ఇస్లాం, జనాభాలో అత్యధికులు (సుమారు 96-98%) దీనిని ఆచరిస్తున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగం ఇస్లాంను అధికారిక మతంగా స్థాపించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: