ఏసుక్రీస్తు జన్మస్థలమైన బెత్లెహేంలో, (Bethlehem) గాజాపై ఇజ్రాయెల్ (Israel) యుద్ధం సృష్టిస్తున్న విధ్వంసం మధ్య, రెండేళ్ల తర్వాత క్రిస్మస్ ట్రీ వెలుగులు విరజిమ్మాయి. ఈ సంబరాలు పాలస్తీనియన్లలో ఒకేసారి ఆశను మరియు ఆవేదనను నింపుతున్నాయి.
Read Also: Elon Musk: భారత్లో స్టార్లింక్ సేవలు, ప్లాన్ ధరలు వెల్లడించిన మస్క్
- నిరాడంబర వేడుక: ఈసారి క్రిస్మస్ వేడుకలను కేవలం మతపరమైన ప్రార్థనలు మరియు సంప్రదాయాలకే పరిమితం చేశారు. మాంగర్ స్క్వేర్లో స్థానిక అధికారులు, చర్చి పెద్దల సమక్షంలో నిరాడంబరంగా క్రిస్మస్ ట్రీని వెలిగించారు.
- విషాద వాతావరణం: ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ప్రార్థన గీతాలు ఆలపించారు. అయినప్పటికీ, గాజాలో జరుగుతున్న విధ్వంసం, మరణాల కారణంగా వేడుకల్లో ఆనందం కన్నా విషాదమే ఎక్కువగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.
చీకటిని పారదోలి ఆశను నింపే ప్రయత్నం
ఈ వేడుకల ఉద్దేశంపై ఎవాంజెలికల్ లూథరన్ చర్చి ఫాదర్ ముంథర్ ఐజాక్ మాట్లాడుతూ, “ఈ వేడుకలు మునుపటిలా లేవు. మా హృదయాల్లో గాజా విషాదం నిండి ఉంది. అయినా, ఈ కష్టకాలంలోనూ మేం జీవించాలని ఆశిస్తున్నాం. బెత్లెహేం క్రిస్మస్ రాజధానిగా నిలవాలనే సందేశాన్ని ప్రపంచానికి పంపుతున్నాం” అని తెలిపారు.
బెత్లెహేం మేయర్ మహేర్ ఎన్ కనవతి మాట్లాడుతూ, “చీకటిని పారదోలి ప్రజల్లో ఆశను నింపేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. పోప్ లియో-14 కూడా బెత్లెహేం ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లు సందేశం పంపారు” అని అన్నారు.
ఇజ్రాయెల్ ఆంక్షలతో దెబ్బతిన్న పర్యాటక రంగం
ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా బెత్లెహేంలో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆదాయం లేకపోయినా, రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందన్న ఆశతోనే వ్యాపారులు కాలం వెళ్లదీస్తున్నారు.
స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బెత్లెహేం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్లోని పాలస్తీనియన్లను బస్సుల్లో ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, విదేశీ పర్యాటకుల రాక లేకపోవడంతో హోటళ్లలో ఆక్యుపెన్సీ కేవలం 20 శాతంగానే ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: