📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Belgium: మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుమారు రూ.13,850 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్ బి) కుంభకోణంలో(Belgium) ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రరాల వ్యాపారి మెహుల్ చోక్సీ ని భారత్ కు రప్పించే దిశగా భారత ప్రభుత్వం మరో భారీ విజయాన్ని అందుకుంది. తన అప్పగింతను సవాలు చేస్తూ మెహుల్ చోక్సీ దాఖలు చేసిన చివరి అప్పీల్ ను బెల్జియం అత్యున్నత న్యాయస్థానమైన ‘కోర్ట్ ఆఫ్ కాసేషన్’ తాజాగా కొట్టివేసింది. ఈ తీర్పుతో చోక్సీ ని భారత్ కు రప్పించేందుకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఎనిమిది సంవత్సరాలుగా భారత్(India) చేస్తున్న కృషికి నేడు ఫలితం దక్కనున్నది. గతంలో ఆంట్వెర్ప్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇచ్చిన అప్పగింత ఉత్తర్వులను సవాలు చేస్తూ చోక్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భారత్ లో తనకు న్యాయమైన విచారణ జరిగదని, అక్కడ జైళ్లలో చిత్రహింసలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వాదించారు. అయితే ఈ వాదనలను బెల్జియం సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. భారత్ ఇచ్చిన హామీలు నమ్మదగినవిగా ఉన్నాయని, చోక్సీకి ఎటువంటి ప్రాణహాని లేదా మానవ హక్కుల ఉల్లంఘన జరగదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా పిటిషన్ వేసినందుకుగాను చోక్సీకి జరిమానా కూడా విధించింది.

Read also: America: హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ముంబై జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు

(Belgium) మెహుల్ చోక్సీని భారత్ కు రప్పించిన తర్వాత ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచుతామని భారత ఏజెన్సీలు కోర్టుకు వివరించాయి. అక్కడి బ్యారక్ నంబరు 12లో ఆయన కోసం అన్ని వసతులతో కూడిన గదిని కేటాయించినట్లు మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని సాక్ష్యాధారాలతో సహా భారత్ నిరూపించింది. ఈ వివరణతో సంతృప్తి చెందిన చెల్జియం న్యాయస్థానం చోక్సీ అప్పగింత ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఆదేశించింది. 2018లో పీఎన్ బీకుంభకోణం బయటపడటానికి కొద్దిరోజుల ముందే చోక్సీ భారత్ నుంచి పరారయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Belgium Court Economic Offence Extradition to India Indian Agencies Latest News in Telugu mehul choksi PNB Scam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.