Bangladesh violence: బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస భయంకరం.. అగ్నిదాడిలో చిన్నారి మృతి

Read Time:  1 min
Bangladesh violence
Bangladesh violence
FONT SIZE
GET APP

బంగ్లాదేశ్‌లో(Bangladesh violence) అరాచక పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. రాజకీయ వైరం కారణంగా జరిగిన ఓ దారుణ ఘటనలో ఒక పసి ప్రాణం మంటల్లో చిక్కుకుని మరణించగా, ఒక కుటుంబం మొత్తం తీవ్ర ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంది. ఈ సంఘటన లక్ష్మీపూర్ సదర్ ఉపజిల్లాలో చోటుచేసుకుని దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Read also: RAB investigation: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై షాకింగ్ నిజాలు

Bangladesh violence
Political violence in Bangladesh is horrific; a child died in an arson attack.

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన నేత, వ్యాపారవేత్త బేలాల్ హొస్సేన్ నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లోని వారు నిద్రలో ఉన్న సమయంలో దుండగులు ముందే పథకం వేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంటి ముందు ఉన్న రెండు తలుపులను బయట నుంచి తాళం వేసి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఇంట్లో ఉన్నవారు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది.

ఈ అగ్నిప్రమాదంలో(Bangladesh violence) బేలాల్ హొస్సేన్ ఏడేళ్ల కుమార్తె అయేషా అక్తర్ మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. బేలాల్‌తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు సల్మా అక్తర్ (16), సమియా అక్తర్ (14)లకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వారి శరీరాల్లో 50 నుంచి 60 శాతం వరకు కాలిన గాయాలు ఉండటంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని ఢాకాలోని బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్‌స్టిట్యూట్కు తరలించారు.

కళ్లముందే కాలిపోయిన ఇల్లు

ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ బేలాల్ తల్లి హేజరా బేగం కన్నీటి పర్యంతమయ్యారు.
“అర్ధరాత్రి కిటికీలోంచి చూసేసరికి నా కొడుకు ఇల్లు మంటల్లో కూరుకుపోయింది. కేకలు వేస్తూ అక్కడికి పరుగెత్తాను. కానీ తలుపులు బయట నుంచి తాళం వేసి ఉన్నాయి. నా కొడుకు తలుపులు బద్దలుకొట్టి బయటకు వచ్చాడు. కోడలు నాలుగు నెలల పసికందును, ఆరేళ్ల కుమారుడిని రక్షించుకోగలిగింది. కానీ లోపల నిద్రపోతున్న మనవరాళ్లు మంటల్లో చిక్కుకున్నారు” అని ఆమె వాపోయారు.

శాంతిభద్రతలపై ప్రశ్నలు

మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలకు ఈ ఘటన మరింత బలం చేకూరుస్తోంది. రాజకీయ నేతలు, మైనారిటీలే లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో నిందితులు ఎవరు? దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని లక్ష్మీపూర్ మోడల్ థానా పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.