గతకొంత కాలంగా బంగ్లాదేశ్ లో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు దాడులకు పూనుకుంటారో తెలియని పరిస్థితి అక్కడ ఉంది. ప్రజల క్షేమానికి ఏమాత్రం భరోసా లేదు. నిరసనకారులు ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్ లో శుక్రవారం రాత్రి గందరగోళం నెలకొంది. ఆనందంగా ముగించాల్సిన ఓ పాఠశాల వార్షికోతవం అర్ధరాత్రి కల్లోలంగా మారింది. రాత్రి ఇస్లామిస్టు గుంపు ప్రముఖ రాక్ గాయకుడు జేమ్స్ నిర్వహించిన సంగీత కార్యక్రమంపై దాడి చేయడంతో షోను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో కనీసం 20 మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం ‘నగర్ బౌల్ ప్రసిద్ధి చెందిన జేమ్స్ (james) బంగ్లాదేశ్ లోనే అతిపెద్ద రాక్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఫరీద్ పూర్ జిల్లా స్కూల్ 185వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
Read also: US air travel disruption : అమెరికాలో విమానయాన సంక్షోభం
Bangladesh
వేదికపై, ప్రేక్షకులపై రాళ్లు, ఇటుకలు విసిరారు
వేలాదిమంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. మరికొద్ది నిమిషాల్లో కచేరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలో కొందరు దుండగులు వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వేదికపై ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. గాయపడ్డ విద్యార్థులు ఆందోళనకారులు వేదికపై, ప్రేక్షకులపై రాళ్లు, ఇటుకలు విసిరారు. దీంతో జనాల్లో భయాందోళన చెలరేగింది. గాయపడిన వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. తల, చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన విద్యార్థులు దుండగులను క్యాంపస్ నుంచి తరిమివేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో రానరతి 10గంటల సమయంలో నిర్వాహక కమిటీ కన్వీనర్ డాక్టర్ మోస్తఫిజుర్ రహ్మాన్ షమీమ్ వేదికపై నుంచి కచేరినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గందరగోళం మధ్య జేమ్స్ తృటిలో తప్పించుకున్నారు. బంగ్లాదేశ్ లోనే అత్యంత పాత ప్రభుత్వ విద్యాసంస్థలలో ఫరీద్ పూర్ జిల్లా స్కూల్ ఒకటి. 1840లో బ్రిటిష్ పాలనలో దీన్ని స్థాపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: