బంగ్లాదేశ్(Bangladesh) లోని మైమెన్సింగ్ జిల్లా లింఛింగ్ ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు దేశ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ శనివారం తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 27 ఏళ్ల సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ యూనస్ ప్రభుత్వం గుర్తించింది. ఎక్స్ (ట్విటర్) లో పోస్టు చేసిన యూనస్ ‘మైమెన్సింగ్ లోని భలుకా ప్రాంతంలో సనాతన హిందూ యువకుడు దీపు చంద్రదాస్ ను కొట్టి చంపిన ఘటనలో ర్యాపిడ్ యాక్షన్ బ్యాటాలియన్ ఎడుగురిని అనుమానితులుగా అరెస్టు చేసింది.’ అని ఆయన పేర్కొన్నారు. అరెస్టు అయినవారిలో ఎం.డి. లిమోన్ సర్కార్ (19), ఎండి. తారెక్ హొస్సేన్ (19), ఎం.డి. మాణిక్ మియా(20), ఎర్షాద్ అలీ(39), నిజుమ్ ఉద్దిన్(20), అలాంగీర్ హొస్సేన్ (38), ఎం.డి. మిరాజ్ హొస్సేన్ అకోన్ (46) ఉన్నారని తెలిపారు.
Read Also: Pakistan: అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 17ఏళ్ల జైలుశిక్ష

హిందూ యువకుడి దారుణ హత్య
ఈ శుక్రవారం మైమెన్సింగ్ హిందూ(Bangladesh) యువకుడు దీపు చంద్ర దాస్ ని దారుణంగా కొట్టి, చెట్టుకు కట్టేసి, కాల్చి చంపారు. చంద్రదాస్ మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంపేసినట్లు బంగ్లా మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ హింసపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ శుక్రవారం స్పందించారు. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యూ బంగ్లాదేశ్ లో ఈ రకమైన హింసకు చోటు లేదన్నాఉ. ఈ క్రూరమైన నేరంలో పాల్గొన్న ఎవరినీ మేం వదలబోం అని అన్నారు. కొన్ని తీవ్రవాద గ్రూపులు నిర్వహిస్తున్న హింసపట్ల అప్రమత్తంగా ఉండాలని తాత్కాలిక ప్రభుత్వం ప్రజలను కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: