భారతదేశంతో సంబంధాలు దెబ్బతిన్న బంగ్లాదేశ్ (Bangladesh) కొత్తమిత్రదేశాల వైపు మొగ్గుచూపుతున్నది. తాజాగా పాకిస్థాన్ తో బంగ్లాదేశ్ దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు యత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఈరెండు దేశాల మధ్య వీసా రహిత ఒప్పందం కుదుర్చుకుంది. ఆ రెండు దేశాల్లోకి రాకపోకలు సాగించేందుకు వీసా అవసరాన్ని రద్దు (Visa requirement Cancellation) చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పాకిస్థాన్ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ, బంగ్లాదేశ్ హోంమంత్రి జహంగీర్ ఆలంచౌదరి మధ్య ఢాకాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం వల్ల పాక్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.
అప్రమత్తమైన భారత్
పాకిస్థాన్, బంగ్లాదేశ్ (Bangladesh) తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ అప్రమత్తమయ్యింది. వీసా రహిత సౌకర్యాన్ని వినియోగించుకొని పాక్ నిఢా సంస్థల ఏజెంట్లు లేదా అనుమానితశక్తులు బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా అంతర్గత ఉగ్రవాద కార్యకలాపాలను (Terrorist activities) ప్రోత్సహిస్తోంది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరు దేశాలమధ్య సంబంధాలు తెగిపోయాయి. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాక్ వైఖరిపట్ల కఠినంగా ఉండేది. అయితే ఆమె ప్రభుత్వం కూలిపోవడంతో ఇటీవల మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాక్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. దీనికితోడు టర్కీ కూడా ఇరుదేశాలతో సంబంధాలు పెంచుకుంటోంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Italy Plane Crash: బ్రెస్సియా హైవేపై విమాన ప్రమాదం 2025