బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్(Yunus) ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు ఉన్న ప్రత్యేకతలలో ఫేక్ వార్తలు కూడా ఒకటంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. ”గతేడాది బంగ్లాదేశ్లో అధికార ప్రభుత్వం నుంచి ప్రజలు తిరుగాబుటు చేశారు. దీనివల్ల అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడులు జరిగినట్లు పెద్దఎత్తున ప్రచారం నడిచిందని” జర్నలిస్టు ప్రశ్నించారు.
California Helicopter Crash: అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదం
తప్పుడు వార్తలంటూ కొట్టిపారేసిన యూనస్
దీనిపై స్పందించిన మహమ్మద్ యూన్ అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేశారు. కొన్ని ప్రాంతాల్లో భూ వివాదాలు జరిగితే దాన్ని మత ఘర్షణులుగా కొందరు ప్రచారాలు చేశారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా భారత్పై ప్రస్తుతం అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్పై 35 శాతం టారిఫ్ విధిచంగా ఇరుదేశాల మధ్య సంప్రదింపుల జరిగిన అనంతరం 20 శాతం తగ్గింది. ఈ అంశంపై కూడా యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా టారిఫ్లు బంగ్లాదేశ్ కన్నా భారత్లో అధికంగా ఉన్నాయన్నారు. భారత్లో ఉన్న పరిశ్రమలు త్వరలోనే తమ దేశాన్ని వదిలేసి బంగ్లాదేశ్కు వస్తాయని చెప్పారు.
డాక్టర్ యూనస్ కు నోబెల్ బహుమతి ఎందుకు వచ్చింది?
“దిగువ నుండి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని సృష్టించడానికి” చేసిన కృషికి గాను ముహమ్మద్ యూనస్ మరియు గ్రామీణ్ బ్యాంక్ 2006 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
డాక్టర్ యూనస్ విద్యా అర్హత ఏమిటి?
బంగ్లాదేశ్లోని ఢాకా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాక, ప్రొఫెసర్ యూనస్ యునైటెడ్ స్టేట్స్లోని వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం అధ్యయనం చేయడానికి ఫుల్బ్రైట్ స్కాలర్షిప్ పొందారు, అక్కడ ఆయన 1971లో పిహెచ్డి పట్టా పొందారు. యుఎస్లో ఉన్నప్పుడు, మిడిల్ టేనస్సీ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం కూడా బోధించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: