Bangladesh BNP statement : బంగ్లాదేశ్లో 13వ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ, ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తమ విదేశాంగ, దేశీయ విధానాలపై కీలక ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే భారత్తో సహా అన్ని పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది.
బీఎన్పీ అధికార ప్రతినిధి మహదీ అమీన్ మాట్లాడుతూ, “భారత్తో బలమైన సంబంధాలు కొనసాగించడం బంగ్లాదేశ్ ప్రయోజనాల్లో భాగం. అయితే ఆ బంధం న్యాయం, సమానత్వం, పరస్పర గౌరవం అనే సూత్రాలపై ఆధారపడి ఉండాలి” అని తెలిపారు. ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్యం, విద్య, వైద్య రంగాల్లో సహకారం పెంచాలనుకుంటున్నామని చెప్పారు.
Read Also: Manipur Violence: మణిపుర్లో మరోసారి అల్లర్లు
మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారంలో లేకపోతే భారత్తో సంబంధాలపై ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్నకు, “దీనిపై తుది నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలదే. బీఎన్పీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల ఆశయాలకు అనుగుణంగా ద్వైపాక్షిక విధానాలు ఉంటాయి” అని సమాధానమిచ్చారు.
అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను మెరుగుపరచడం తమ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. చట్ట అమలు సంస్థలు జవాబుదారీతనంతో పని చేసేలా వ్యవస్థను బలోపేతం చేస్తామని, మానవ హక్కులు, భావప్రకటన స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మైనారిటీల భద్రతపై స్పందిస్తూ, “మతం, విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి సమాన రక్షణ కల్పించటం మా సిద్ధాంతం” అని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతల మధ్య పోలింగ్ నిష్పాక్షికతపై పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: