భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత, బంగ్లాదేశ్(Bangladesh) కూడా అగ్రరాజ్యమైన అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12న బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, 9వ తేదీన హడావుడిగా ఈ ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also:Pakistan Army: బలూచిస్థాన్లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

ప్రజలతో చర్చ లేకుండానే డీల్కు సిద్ధమవుతుందా?
సాధారణంగా వాణిజ్య ఒప్పందాల విషయంలో ప్రభుత్వం పలు దశల్లో చర్చలు నిర్వహించి, ఒప్పందంలోని ముఖ్య అంశాలను ప్రజలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలతో పంచుకుంటుంది. అయితే ఈసారి అలాంటి ప్రక్రియ ఏదీ కనిపించకపోవడంతో, ఈ డీల్ను పూర్తిగా గోప్యంగా కుదుర్చుకునే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ వర్గాల్లో, పారిశ్రామిక రంగంలో ఆందోళన
ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు ఇలాంటి కీలక ట్రేడ్ డీల్కు సంతకాలు చేయడం వెనుక ఉద్దేశాలపై రాజకీయ వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒప్పందంలోని నిబంధనలు బంగ్లాదేశ్ ఆర్థిక(Bangladesh) ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: