జపాన్(Japan)లో భారీ సునామీ వస్తుందని, అంతం అవుతుందని బాబా వంగా(Baba Vanga) తన పుస్తకంలో రాశారని గత రెండు రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. అయితే అప్పటి నుంచి ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలు యుగాంతానికి మొదలు తెలుస్తోంది. జపాన్లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అలాగే అమెరికా(America)లో భారీగా వరదలు వస్తున్నాయి. వీటితో పాటు ఇండియా, మయన్మార్(India, Myanmar) సరిహద్దులో భూకంపం వచ్చింది.
36 గంటల్లో 6 సార్లు..
రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనాలు సృష్టించింది. 36గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించింది. దీంతో సరిహద్దుల్లోని మణిపూర్ ప్రజలు భూకంపంతో వణికిపోతున్నారు. దీంతో దేశంలో యుగాంతం ఎఫెక్ట్ మొదలైందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే లాస్ఏంజిల్స్, కాలిఫోర్నియాకు భూకంప హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని జపాన్కు చెందిన న్యూ బాబా వంగా తన ప్రిడిక్షన్లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని 1999లో ది ఫ్యూచర్ ఐసా లో అనే పుస్తకంలో రాశారు. అయితే నిజంగానే జపాన్లో భూకంపం సంభవిస్తుందని, యుగాంతం తప్పదని ప్రజలు భయపడ్డారు. యుగాంతం అయితే రాలేదు.. కానీ జపాన్లో భూకంపాలు మాత్రం వచ్చాయి.
అమెరికాలో వరదలు – ప్రళయం సంకేతమా?
కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావం.
అక్కడ భూకంప హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో ప్రకృతి ప్రకోపాలకు సంబంధించి యుగాంతం ప్రచారం మరింత ఊపందుకుంది. సోషల్ మీడియాలో జోరు – యుగాంతపు వాదనలు విస్తరిస్తున్నాయ్.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, “యుగాంతం మొదలైంది”, “బాబా వంగా ప్రిడిక్షన్ నిజమవుతోందా?” అనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో భయభ్రాంతులు, చర్చలు ఎక్కువయ్యాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం వాస్తవ పరిస్థితులను శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి అని సూచిస్తున్నారు .
భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన అతి పెద్ద భూకంపం 1950లో అస్సాం-టిబెట్ భూకంపం. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.6 గా నమోదైంది. ఇది భారత-చైనా సరిహద్దు ప్రాంతాన్ని తాకింది.
మరో ముఖ్యమైన భూకంపం 2001లో గుజరాత్ రాష్ట్రంలోని భూజ్ వద్ద సంభవించింది. దీని తీవ్రత కూడా 8.6 గా నమోదైంది. ఈ భూకంపం తీవ్రంగా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కలిగించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: IND vs ENG: టెస్టు సిరీస్లో చరిత్ర సృష్టించిన టీమిండియా