B-1B Lancer Bombers: పశ్చిమాసియాలో ఇరాన్తో పెరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా యుద్ధ తంత్రాన్ని వేగవంతం చేసింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే తన వైమానిక దళంలోని అత్యంత శక్తివంతమైన B-1B లాన్సర్ బాంబర్ విమానాలను యుద్ధ క్షేత్రంలోకి దించింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఈ విమానాలు మధ్యప్రాచ్య ఆకాశంలో మోహరించాయి.
Read Also: Shriyanshi: బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!
ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ ప్రారంభం
సౌత్ డకోటాలోని ఎల్స్వర్త్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన ఈ బాంబర్ విమానాలు, నేరుగా యుద్ధ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఛేదించగల సత్తా ఉన్న ఈ సూపర్సోనిక్ విమానాల రాక, యుద్ధం మరో స్థాయికి చేరబోతోందనే సంకేతాలను ఇస్తోంది.
B-1B లాన్సర్ ప్రత్యేకత
ఈ విమానాలు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను మోసుకెళ్లడమే కాకుండా, శత్రువుల రాడార్లకు చిక్కకుండా మెరుపు దాడులు చేయగలవు. ఇరాన్కు వ్యతిరేకగా చేస్తున్న ఈ వ్యూహాత్మక మోహరింపు మధ్యప్రాచ్యంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా ఆస్తులు మరియు మిత్రదేశాల రక్షణే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: