ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత బోండి బీచ్ లో హనుక్కా వేడుకల వేళ ఓ తండ్రి కుమారుడు ప్రజలపై జరిపిన కాల్పుల్లో 15మంది మరణించారు. ఈ ఘటన దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. యూదులు చేసుకునే హనుక్కా వేడుకలు కాస్త విషాదంగా మారింది. ఈ కాల్పుల ఘటన ఆ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర దాడిలో ఓ ఉగ్రవాదితో పాటు 16మంది మరణించారు. వీరిలో అత్యంత పిన్నవయస్కురాలైన పదేళ్ల మట్టిల్గా అంత్యక్రియలు గురువారం వందలాది మంది మధ్య జరిగాయి. ఈ విషాద ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese) ద్వేషపూరిత ప్రసంగాలపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. యూదు సమాజంపై పెరుగుతున్న ద్వేషం యూదు సమాజంపై పెరుగుతున్న దాడులు, విద్వేష ప్రసంగాల పట్ల అల్బనీస్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేషాన్ని వెళ్లగక్కే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రధాని స్పష్టం చేశారు.
Read also: Oscars: యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
Australia Shooting
ఒక చిన్నారి ప్రాణం బలికావడం
ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిని.. హింసను ప్రేరేపించే వారిని కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాలను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అలాంటి విదేశీయుల వీసాలను రద్దు చేయడం, నిరాకరించడం వంటివి చేయనున్నట్లు వెల్లడించారు. తుపాకీ చట్టాలు మరింత కఠినతరం మరోవైపు న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం తుపాకీ చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు వచ్చేవారం అత్యవసరంగా పార్లమెంటును సమావేశపరుస్తోంది. ఒక చిన్నారి ప్రాణం బలికావడం ఆస్ట్రేలియాలో భద్రతా వ్యవస్థపై తీవ్ర చర్చకు దారితీసింది. ‘మట్టిలా’ అంత్యక్రియలు వేళ దేశం మొత్తం కంటతడి పెట్టింది. కాగా కాల్పులు జరిపిన తండ్రి సాజిత్ అక్రమ్ (50) పోలీసుల కాల్పుల్లో మరణించగా అతని కుమారుడు నవీద్ అక్రమ్(24) గాయపడి, చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఇతనిపై 59 రకాల నేరారోపణలు మోపారు. ఇందులో హత్య, ఉగ్రవాదం వంటి అభియోగాలున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: