ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిరోధించే ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ (Instagram) వంటి మెటా (Meta) యాజమాన్యంలోని సోషల్ మీడియా సంస్థలు, గడువుకు ముందే అక్కడి పిల్లల ఖాతాలను బ్లాక్ చేయడం ప్రారంభించాయి.
Read Also: Indigo: ఇండిగో విమానాల రద్దు.. లక్ష దాటిన ఫ్లైట్ టికెట్ ధర

ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఆస్ట్రేలియా
తమ నిర్ణయంపై ఆస్ట్రేలియా (Australia) ఇంటర్నెట్ రెగ్యులేటరీ స్పందిస్తూ, పిల్లలను సోషల్ మీడియా యాప్లకు దూరంగా ఉంచేందుకు తాము తీసుకుంటున్న చర్యలను ప్రపంచ దేశాలు అనుసరించాలని సూచించింది.
ఈ-సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ మాట్లాడుతూ, పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ విధించడాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని, ఈ విషయంలో అన్ని దేశాలకు ఆస్ట్రేలియా ఉదాహరణగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొదట్లో ఈ నిర్ణయం గురించి తాను ఆందోళన చెందానని, కానీ ఈ విధానాన్ని చాలామంది తల్లిదండ్రులు స్వాగతిస్తుండటంతో తన ఆలోచనను మార్చుకున్నానని ఆమె పేర్కొన్నారు.
టీనేజర్లకు డేటా డౌన్లోడ్ సూచన
పదహారేళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు సోషల్ మీడియాను వాడకుండా నిషేధిస్తూ చేసిన ఈ చట్టం వల్ల వేలాదిమంది టీనేజర్ల సామాజిక మాధ్యమ ఖాతాలు ప్రభావితం కానున్నాయి.
ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా సంస్థలు పిల్లల ఖాతాలను బ్లాక్ చేస్తున్నందున, అందులోని వారి ఫొటోలు, ఇతర డేటాను గడువుకు ముందే డౌన్లోడ్ చేసుకోవాలని వారికి సూచిస్తున్నాయి. ఈ నిర్ణయంపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: