మతం పేరుతో మారణహోమాన్ని సృష్టించేందుకు ప్రయత్నించే ఏ సంస్థలైనా అవి ఉగ్రసంస్థలే. మతం మనిషికి మనిషి ప్రేమించాలని, సాయం చేయాలని బోధిస్తుంది. కానీ హతమార్చాలని చెప్పదు. కానీ మతం ముసుగులో ‘జీహాద్’ (పవిత్ర) యుద్ధానికి యువత ఆకర్షితులవుతున్నారు. ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఈ పవిత్ర యుద్ధంలో మరణిస్తే.. వారు అమరులై పోతారనే భ్రమలో ఉంచుతూ, ఉగ్ర ఉచ్చులోకి లాగుతున్నారు. నేడు ప్రపంచదేశాలకే ఉగ్రవాద సంస్థ పెద్దసవాలుగా నిలిచాయి.
Read Also: Anthony Albanese: ఆస్ట్రేలియా హీరో అహ్మద్ ను పరామర్శించిన ప్రధాని
తాజాగా ఆస్ట్రేలియాలో కూడా ఉగ్రదాడిలో పలువురు మరణించారు. ఆదివారం జరిగిన ఉగ్రదాడితో ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీ బోండీ బీచ్ లో (Bondi Beach) యూదులపై ఆదివారం ఉగ్రదాడికి పాల్పడింది. తండ్రీ కుమారులేనని పోలీసులు తేల్చారు. వారిని సాజిద్ అక్రమ్ (50), అతడి కుమారుడు నవీద్ అక్రమ్(24)గా గుర్తించారు.
విద్యార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చిన సాజిద్
1998లో సాజిద్ ఆస్ట్రేలియాకు విద్యార్థిగా వచ్చాడు. ఆ తర్వాత పౌరుడిగా మారాడు. నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. సాజిద్ పోలీసుల కాల్పుల్లో హతం కాగా.. నవీద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవీద్ పాకిస్థానీ జాతీయుడని తొలుత చెప్పిన అధికారులు ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనే పుట్టాడని నిర్ధారించారు. సాజిద్ ఎక్కడ నుంచి వలస వచ్చిందీ చెప్పలేదు. వీరికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15మంది మరణించగా,42మంది గాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: