
సోషల్ మీడియా వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనకు తెలియని కాదు. చిన్నవయసులోనే సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. తెలిసీతెలియని వయసులో పరిచయాలు ప్రేమగా భ్రమించి, తమ కెరీర్ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. ఎవరు ఎంతగా చెబుతున్నా వినడం లేదు.అసలు ఫోన్ ఎక్కువగా వాడవద్దని చెబుతున్నందుకు కన్నవారిని హతమారుస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం కదా! పిల్లలపై సోషల్ మీడియా తీసుకొస్తున్న అనర్థాలను దృష్టిలో ఉంచుకునే ఆస్ట్రేలియా ప్రభుత్వం కాలక నిర్ణయం తీసుకుంంది. ఆన్ లైన్(Social Media) భద్రతను నిర్ధారించడానికి 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆదేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ఈ నిబంధన 2025 డిసెంబరు 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం 16ఏళ్లలోపు మైనర్లు ఫేస్ బుక్,(Facebook) ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, స్నాప్ చాట్, ఎక్స్, యూట్యూబ్, రెడిట్, కిక్ వంటి ప్లాట్ఫారమ్ లలో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం లేదా వాడటం అనేది చట్టవిరుద్ధం అవుతుంది.
Read also: ఇక అమెరికన్ పౌరుడికి 2వేల డాలర్లు.. ట్రంప్ ఆఫర్

చట్టాన్ని అమలు చేసే బాధ్యత సోషల్ మీడియా కంపెనీలదే బాధ్యత
ఆన్ లైన్ ప్రమాదాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి పిల్లలను రక్షించడానికి ఈ చట్టం రూపొందించబడిందని ప్రభుత్వం చెబుతోంది. మొదట్లో మినహాయింపు ఇవ్వాలని భావించినా, పరిశోధనల తర్వాత యూట్యూబ్ ను కూడా ఈ నిషేధ జాబితాలో చేర్చారు. అయితే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా ఆయా సోషల్ మీడియా కంపెనీలదేని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది.
కంపెనీలకు భారీ జరిమానా
16ఏళ్ల లోపు వారు తమ ప్లాట్ ఫారమ్ లలో అకౌంట్లు క్రియేట్ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంది. ఒకవేళ నిబంధనలు పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.410 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: