ఇరాన్పై (Against Iran) అమెరికా చేపట్టిన సరికొత్త సైనిక చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం సంచలన ప్రకటన చేస్తూ, ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు చేసినట్లు వెల్లడించారు.ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేస్తూ, ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ వంటి కీలక అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగాయని చెప్పారు. ఈ కేంద్రాలపై మేము పూర్తిస్థాయి పేలోడ్తో దాడి చేశాం. దాడి విజయవంతం కావడంతో మా విమానాలన్నీ సురక్షితంగా తిరిగి వచ్చాయి. ఇది ప్రపంచంలోనే ఒక దార్శనిక దాడిగా నిలుస్తుంది, అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికన్ యోధులకు అభినందనలు – ట్రంప్
ఈ విజయానికి ప్రధాన కారకులైన అమెరికన్ సైనికులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత అద్భుతంగా దాడిని పూర్తి చేసిన మా యోధుల్ని మెచ్చుకోవాలి. ఈ విజయం తర్వాత ఇప్పుడు శాంతికి మార్గం సుగమం అవుతుంది. ఈ క్షణాన్ని ముఖ్యంగా గుర్తించండి, అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.ఇరాన్పై దాడుల వివరాలను జాతీయ స్థాయిలో వెల్లడించేందుకు ట్రంప్ రాత్రి 10 గంటలకు వైట్ హౌస్ నుంచి ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఇది అమెరికా, ఇజ్రాయెల్, అంతర్జాతీయ శాంతికి ఓ చారిత్రక మలుపు. ఇరాన్ ఈ ఉద్రిక్తతలకు ముగింపు పలకాలి, అని మరోసారి స్పష్టం చేశారు.
చర్చలకు రెండు వారాల గడువు – ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలకు రావాలంటే గరిష్టంగా రెండు వారాల గడువు మాత్రమే ఉందని ట్రంప్ హెచ్చరించారు. వారం రోజుల క్రితం ఇజ్రాయెల్ అణు కేంద్రాలపై దాడులు ప్రారంభించగా, దానికి ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి దాడులతో స్పందించింది. ప్రస్తుతం అమెరికా కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశముంది.
Read Also : US Visa : త్వరలోనే వీసాల షెడ్యూలింగ్ను పునరుద్దరిస్తామన్న అమెరికా