ఆసియాకప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్పై ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆనందపరిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా (Team India) సమష్టిగా, స్థిరమైన ప్రదర్శనతో 7 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ ఫలితమే కాకుండా, ఆటగాళ్ల ప్రవర్తన, ముఖ్యంగా షేక్హాండ్ విషయంలో కలిగిన వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విజయం తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్స్తో షేక్హాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయిన సంఘటన పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్ ఆటగాళ్ల దృక్కోణంలో, వారు భారత ఆటగాళ్ల నుంచి ఫ్రెండ్లీ జెస్చర్ ఆశించగా, ఆ ఆశ విఫలమై నిరాశ చెందారు. ఈ సంఘటనపై సోషల్ మీడియా (Social media) వేదికగా అనేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు భారత అభిమానులు,టీమ్ఇండియాని ప్రశంసిస్తూ, షేక్హాండ్ ఇవ్వకపోవడం సరైన నిర్ణయం అని పేర్కొన్నారు.
ఆటను ఆటలా చూడాలని హితవు పలుకుతున్నారు
పాకిస్థాన్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, దిగ్గజ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఆటను ఆటలా చూడాలని హితవు పలుకుతున్నారు.ఈ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ను ఓ మీడియా ప్రతినిధి.. షేక్ హ్యాండ్ వ్యవహారంపై ప్రశ్నించాడు. ‘మీరు సిక్స్ తో మ్యాచ్ ముగించారు. అనంతరం నేరుగా డగౌట్కు వెళ్లిపోయారు. పాక్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా.. మీరు పట్టించుకోలేదు.

ఇలా చేయాలని ముందుగానే టీమ్ సమావేశంలో నిర్ణయించారా? మ్యాచ్ అనంతరం జట్టు మొత్తం ఒకే విషయంపై కట్టుబడి ఉండాలని చర్చించుకున్నారా? ‘అని ఓ మీడియా ప్రతినిధి అడిగాడు. తాము ఇక్కడికి కేవలం క్రికెట్ (Cricket) ఆడేందుకు మాత్రమే వచ్చామని, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని సూర్య బదులిచ్చాడు.
సూర్య తన సమాధానాన్ని ఇచ్చాడు
‘మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. ఈ విజయంతో పాకిస్థాన్ (Pakistan) కు సరైన సమాధానం ఇచ్చామని అనుకుంటున్నా. బీసీసీఐ, భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. జీవితంలో కొన్నిసార్లు క్రీడా స్ఫూర్తి కంటే ముందుండే విషయాలు చాలా ఉంటాయి. వాటిని నేను పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లోనే చెప్పాను.’అని సూర్య బదులిచ్చాడు.
పాకిస్థాన్తో మ్యాచ్ ఆడటమే ఎక్కవ.. మళ్లీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడమా? అన్నట్లు సూర్య తన సమాధానాన్ని ఇచ్చాడు. బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకే ఈ మ్యాచ్ ఆడినట్లు పరోక్షంగా వెల్లడించాడు. తమకు కూడా పాక్తో మ్యాచ్ ఆడాలనే ఆసక్తి లేదనే విషయాన్ని తన మాటల్లో స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: