📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Owasi: పాక్ అణు హెచ్చరికలపై అసదుద్దీన్ ఒవైసీ గట్టి కౌంటర్

Author Icon By Pooja
Updated: August 12, 2025 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా గడ్డపై నుంచిఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ భారత్‌పై అణు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా ఖండించారు. కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా, ఈ అంశాన్ని మోదీ ప్రభుత్వం అమెరికా వద్ద బలంగా ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు.అసదుద్దీన్ ఒవైసీ

మంగళవారం నాడు ‘ఎక్స్‌’ వేదికగా ఒవైసీ (Owasi) స్పందిస్తూ, “భారత్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఉపయోగించిన భాష, ఆయన చేసిన బెదిరింపులు తీవ్రంగా ఖండించదగినవి. అమెరికా(America) గడ్డపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత దారుణం. దీనిపై మోదీ ప్రభుత్వం కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా రాజకీయంగా స్పందించాలి. అమెరికా ప్రభుత్వానికి గట్టిగా నిరసన తెలపాలి” అని పేర్కొన్నారు.

భారత సైన్యాన్ని మరింతగా ఆధునికీకరించుకోవాలి: ఒవైసీ

గత శనివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో పాకిస్థానీ ప్రవాసులతో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ డిన్నర్‌లో అసిమ్ మునీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “మేం ఒక అణుశక్తి దేశం. మేం పతనమవుతున్నామని భావిస్తే, మాతో పాటు సగం ప్రపంచాన్ని ముంచేస్తాం” అని ఆయన హెచ్చరించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పాక్ హెచ్చరికలకు స్పందించిన భారత్

పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ చేసే అణు బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.

అసదుద్దీన్ ఓవైసీ ఎవరు?
అసదుద్దీన్ ఓవైసీ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు AIMIM (All India Majlis-e-Ittehad-ul-Muslimeen) పార్టీ అధ్యక్షుడు. ఆయన హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు కూడా. ఆయన తన ఉజ్వలమైన ప్రసంగశైలి, మైనారిటీల హక్కుల కోసం పోరాటం చేయడంలో ప్రసిద్ధుడు

ఆయన ఏ పార్టీకి చెందినవారు?
AIMIM – అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (All India Majlis-e-Ittehad-ul-Muslimeen).

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/trump-backs-down-90-day-trade-deal-with-china/international/529417/

Asaduddin Owaisi Google news international news latest news Owasi Pakistan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.